మిస్: ఇస్లాంలోకి మారతామని బ్రాహ్మణుల హెచ్చరిక
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామానికి చెందిన సుమారు 150 మంది బ్రాహ్మణులు... తాము ఇస్లాం మతంలోకి మారుతామని హెచ్చరించారు. ఈ నెల ఎనిమిదవ తేదీన బ్రాహ్మణ బాలికను ఒక దళిత వర్గానికి చెందిన ఓ యువకుడు కిడ్నాప్ చేశారని సింఘావలీ అహిర్ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటన పైన పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. వారం రోజులు గడిచినా కిడ్నాప్కు గురైన బాలిక ఆచూకీ పోలీసులు కనిపెట్టలేకపోయారు. దీంతో ఆగ్రహించిన 150 మంది బ్రాహ్మణులు మంగళవారం ఏఎస్పీ విద్యాసాగర్ విుశ్రాను కలిశారు.
కిడ్నాప్ విషయమై పోలీసు అధికారితో మాట్లాడారు. కిడ్నాప్కు గురైన బాలికను తిరిగి తమకు అప్పగించాలని, లేదంటే తాము ఇస్లాం మతంలోకి మారిపోతామని హెచ్చరించారు. ఇదే అంశంపై సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామస్తులు ధర్నా చేశారు. అయితే, బాలిక ఆచూకీ కనుగొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.