అడుగు దూరంలో ఆగిన బీజేపీ.. బెంగళూరుకు అమిత్ షా.. ఎంపీలతో మోదీ భేటి!
కర్ణాటక అసెంబ్లీలో అధికారం చేపట్టడానికి బీజేపీ ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. విధానసభలో అత్యధిక స్థానాలున్న పార్టీగా బీజేపీ అవతరించనప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి మెజారిటీని సొంతం చేసుకోలేకపోయింది. తాజా సమాచారం ప్రకారం.. 222 సీట్లకు లెక్కింపు జరుగగా.. కాంగ్రెస్కు 78, బీజేపీ 104, జేడీఎస్ 38, ఇండిపెండెంట్లు 2 స్థానాలు లభించాయి.
బెంగళూరులో క్షణక్షణానికి మారుతున్న పరిస్థితులపై బీజేపీ దృష్టిపెట్టింది. సీనియర్ నేతలతో బీజేపీ చీఫ్ అమిత్ షా భేటీ అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యేందుకు మంగళవారం అర్ధరాత్రి బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు.
ఇదిలా ఉండగా, కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా సమీక్ష నిర్వహించనున్నారు మంగళవారం సాయంత్రం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకపోవడంతో బీజేపీ శ్రేణులు అసంతృప్తికి లోనయ్యారు. దేశరాజధానితోపాటు అన్ని చోట్ల వేడుకలను నిలిపివేశారు.