ఢిల్లీలో కరోనా రికార్డుల భ్రేక్..: 13వేలు దాటిన కొత్త కేసులు, 200మందికిపైగా మృతి
న్యూఢిల్లీ: మహారాష్ట్రతోపాటు దేశ రాజధాని న్యూఢిల్లీలోనే కరోనావైరస్ పాజిటివ్ కేసులు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. మంగళవారం ఢిల్లీలో 13,468 కరోనావైరస్ కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి మొదలైన నాటి నుంచి ఢిల్లీలో ఇదే అత్యధికం కావడం గమనార్హం.
ఢిల్లీలో గత 24 గంటల్లో 81 మంది మరణించారు. ఒక్క రోజు వ్యవధిలోనే ఈ స్థాయి మరణాలు చోటు చేసుకోవడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి. గత డిసెంబర్ 3న 82 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీ 43,510 యాక్టివ్ కేసులున్నాయి.
పాజిటివిటీ రేటు కూడా భారీగా పెరిగింది. ఇది 13.14 శాతం పెరుగుదల నమోదైంది. గత సంవత్సరం నవంబర్ 15న ఈ రేటు 15.33గా ఉంది. ఢిల్లీలో 6852 హాట్ స్పాట్లను గుర్తించినట్లు ఢిల్లీ సర్కారు తిలిపింది. రికవరీ రేటు స్వల్పంగా తగ్గి 92.67 శాతంగా నమోదైంది. ఈ ఏడాది 93.14 చేరుకుంది. న్యూల్లీలో సోమవారం రోజున 11,491 కరోనా కేసులు నమోదు కాగా, 7655 మంది కోలుకున్నారు.
ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు భారీగా పెరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీలో కరోనా యాక్టివ్ కేసులు 38,095కి చేరింది. ప్రస్తుతం 6175 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు.