శోభనం రాత్రి వధువుతో గడిపితే వరుడికి ప్రాణహాని అంటూ.. మంత్రగాడి దురాగతం
పెళ్లి తర్వాత శోభనం రోజు వధువుతో గడిపితే వరుడు మరణిస్తాడని చెప్పి.. స్వయానా బావతో కలిసి ఓ మంత్రగాడు వధువుపై మొదటి రాత్రి సామూహిక అత్యాచారం జరిపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిలఖ్వా గ్రామంలో వ
లక్నో : పెళ్లి తర్వాత శోభనం రోజు వధువుతో గడిపితే వరుడు మరణిస్తాడని చెప్పి.. స్వయానా బావతో కలిసి ఓ మంత్రగాడు వధువుపై మొదటి రాత్రి సామూహిక అత్యాచారం జరిపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిలఖ్వా గ్రామంలో వెలుగుచూసింది.
''కేసు వెనక్కి తీసుకుంటావా.. నీ నగ్నచిత్రాలు ఆన్లైన్లో పెట్టమంటావా?''
మీరట్ నగరంలోని లిసారీ గేట్ ప్రాంతానికి చెందిన యువతిని హాపూర్ జిల్లా పిలఖ్వా గ్రామానికి చెందిన వస్త్రవ్యాపారి అయిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. శోభనం రోజు వధువుతో వరుడు గడిపితే వరుడికి ప్రాణహాని ఉందంటూ ఓ మంత్రగాడు వరుడి కుటుంబ సభ్యులకు చెప్పాడు.
దీంతో వారు భయపడిపోయి, దీనికి విరుగుడు కూడా మీరే చెప్పాలంటూ ఆ మంత్రగాడిని వేడుకున్నారు. ఇదే అదనుగా సదరు మంత్రగాడు వారికి ఒక ఉపాయం చెప్పాడు. అలా చేస్తే.. ఇంట్లో బంగారం నిధి కూడా లభిస్తుందని నమ్మబలికాడు.
అంతే.. అత్తింటివారు ఆ మంత్రగాడి మాటలు గుడ్డిగా నమ్మి శోభనం గదిలోకి వధువుతోపాటు ఆమె బావను, మంత్రగాడిని పంపించారు. ఇదే అదనుగా వారిద్దరూ కలిసి మత్తుమందు కలిపిన పానీయం వధువుకు తాగించి ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారు.
మత్తులో ఉన్న వధువు తెల్లారాక స్పృహలోకి రాగానే జరిగిన విషయం తెలిసి అత్తింటి వారిని నిలదీయగా.. వారు మొదటిరాత్రి మంత్రగాడితో గడపకుంటే తమ కుమారుడు మరణిస్తాడని, అందుకే అలా చేయాల్సి వచ్చిందని చెప్పడంతో వధువు షాక్ తింది.
వెంటనే ఆ కొత్త పెళ్లికూతురు అత్తింటిని వదిలి మీరట్ లోని తన పుట్టింటికి వెళ్లి జరిగినదంతా తన కుటుంబ సభ్యులకు తెలిపింది. వారి సహకారంతో సదరు మంత్రగాడు, తన బావ కలిసి చేసిన దురాగతం గురించి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.