వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గల్లంతైన ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆచూకీ దొరికింది: సుష్మా

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లోని ఎయిర్ పోర్ట్‌లో మంగళవారం మధ్యాహ్నాం సంభవించిన పేలుళ్లలో రెండు రోజులు కిందట గల్లంతైన భారత్‌కు చెందిన ఇన్ఫోసిస్‌ ఉద్యోగి రాఘవేంద్రన్‌ గణేశ్‌ ఆచూకీ దొరికిందని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

రాఘవేంద్రన్‌ గణేశ్‌ ఆచూకీని కనిపెట్టామని... అతడు చివరగా మెట్రో రైలులో ప్రయాణించినట్లు ఫోన్ కాల్ ఆధారంగా గుర్తించినట్లు సుష్మాస్వరాజ్ ట్విట్ చేశారు. బెంగుళూరుకు చెందిన రాఘవేంద్రన్‌ గణేశ్‌ గత నాలుగేళ్లుగా బ్రస్సెల్స్‌లోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు.

మంగళవారం మధ్యాహ్నాం బ్రెస్సెల్స్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో స్టేషన్‌లో బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఐసీస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆత్మాహుతి దాడి, బాంబు పేలుళ్ల ఘటనలో 35 మంది చనిపోగా, 200 మందికిపైగా గాయపడ్డారు.

ఈ ఘటన జరిగినప్పటి నుంచి గణేశ్‌ అదృశ్యమయ్యారు. దీంతో అతడి కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీంతో గణేశ్‌ సోదరుడు బ్రస్సెల్స్‌ చేరుకుని ఇండియన్ ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత గణేశ్ ఆచూకీ కోసం ఎంబసీ అధికారులతో కలిసి ప్రయత్నాలు ప్రారంభించారు.

ఈ క్రమంలో అతడి చివరి ఫోన్‌కాల్‌ను ట్రాక్ చేయడంతో అతడు మెట్రో రైలులో ప్రయాణించినట్లు తెలిసిందని సుష్మాస్వరాజ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో అతడి కోసం బ్రస్సెల్స్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులతో పాటు, సోదరుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

సుష్మా ట్వీట్

గల్లంతైన ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆచూకీ దొరికింది

సుష్మా ట్వీట్

గల్లంతైన ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆచూకీ దొరికింది

సుష్మా ట్వీట్

గల్లంతైన ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆచూకీ దొరికింది

సుష్మా ట్వీట్

గల్లంతైన ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆచూకీ దొరికింది

సుష్మా ట్వీట్

గల్లంతైన ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆచూకీ దొరికింది

సుష్మా ట్వీట్

గల్లంతైన ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆచూకీ దొరికింది

English summary
The last phone call of Infosys employee from Bengaluru who has gone missing in Brussels since Tuesday’s deadly terror strike, has been tracked to a metro rail in the Belgian capital, External Affairs Minister Sushma Swaraj on Thursday said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X