వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ తరహలోనే యడ్యూరప్ప: విధానసభ వద్ద భావోద్వేగం, ప్రమాణం

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బిఎస్ యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విధానసౌధకు గురువారం నాడు వచ్చారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప భావోద్వేడానికి గురయ్యారు. విధానసౌధ మెట్లను చేతులతో తాకి ప్రమాణం చేశారు. 2014లో పార్లమెంట్‌లోకి నరేంద్ర మోడీ ఏ తరహలో వెళ్ళారో అదే తరహలో యడ్యూరప్ప కూడ విధాన సభలోకి అడుగుపెట్టారు.

2014లో జరిగిన ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ఘన విజయం సాధించింది. ఈ విజయం తర్వాత ప్రధానమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టే సమయంలో నరేంద్ర మోడీ భావోద్వేగానికి గురయ్యారు.

BS Yeddyurappa enters into vidhan sabha like modi

పార్లమెంట్ మెట్లను తాకి ప్రమాణం చేశారు.మోడీ తరహలోనే కర్ణాటక సీఎం యడ్యూరప్ప కూడ విధాన సభ మెట్లను తాకి భావోద్వేగానికి గురయ్యారు. ఈ మెట్లను తాకి ప్రమాణం చేశారు.

యడ్యూరప్ప కర్ణాటక రాష్ట్రానికి మూడో దఫా ముఖ్యమంత్రిగా గురువారంనాడు బాధ్యతలను స్వీకరించారు. అయితే ఈ దఫా కనీస మెజార్టీకి 8 మంది ఎమ్మెల్యేల దూరంలో బిజెపి ఉండిపోయింది. ఈ తరుణంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప 15 రోజుల్లో తన బలాన్ని నిరూపించుకోవాల్సి వచ్చింది.

English summary
Karnataka chief minister Bs Yeddyurappa Entered in to Vidhan Sabha Like Pm Narendra Modi Entered Into Parliament In 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X