మోడీ తరహలోనే యడ్యూరప్ప: విధానసభ వద్ద భావోద్వేగం, ప్రమాణం
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బిఎస్ యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విధానసౌధకు గురువారం నాడు వచ్చారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప భావోద్వేడానికి గురయ్యారు. విధానసౌధ మెట్లను చేతులతో తాకి ప్రమాణం చేశారు. 2014లో పార్లమెంట్లోకి నరేంద్ర మోడీ ఏ తరహలో వెళ్ళారో అదే తరహలో యడ్యూరప్ప కూడ విధాన సభలోకి అడుగుపెట్టారు.
2014లో జరిగిన ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ఘన విజయం సాధించింది. ఈ విజయం తర్వాత ప్రధానమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా పార్లమెంట్లోకి అడుగుపెట్టే సమయంలో నరేంద్ర మోడీ భావోద్వేగానికి గురయ్యారు.
పార్లమెంట్ మెట్లను తాకి ప్రమాణం చేశారు.మోడీ తరహలోనే కర్ణాటక సీఎం యడ్యూరప్ప కూడ విధాన సభ మెట్లను తాకి భావోద్వేగానికి గురయ్యారు. ఈ మెట్లను తాకి ప్రమాణం చేశారు.
యడ్యూరప్ప కర్ణాటక రాష్ట్రానికి మూడో దఫా ముఖ్యమంత్రిగా గురువారంనాడు బాధ్యతలను స్వీకరించారు. అయితే ఈ దఫా కనీస మెజార్టీకి 8 మంది ఎమ్మెల్యేల దూరంలో బిజెపి ఉండిపోయింది. ఈ తరుణంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప 15 రోజుల్లో తన బలాన్ని నిరూపించుకోవాల్సి వచ్చింది.