ఆర్ఆర్ నగర్ ఎన్నికలు: నాయుడు డబ్బు బలంతో, కాంగ్రెస్, జేడీఎస్ కుమ్మక్కు: యడ్యూరప్ప !
బెంగళూరు: బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ నియోజక వర్గం శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిరత్న నాయుడు విజయంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప స్పంధించారు. డబ్బు బలం ముందు ఏదీ పని చెయ్యదని యడ్యూరప్ప ఆరోపించారు.
బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని నివాసంలో యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. ఆర్ఆర్ నగర్ శాసన సభ నియోజక వర్గంలో కాంగ్రెస్, జేడీఎస్ లోలోపల ఒప్పందం కుదుర్చుకున్న విషయం అందరికీ తెలుసని, ఆ విషయం కొత్తగా మాట్లాడాల్సిన అసరం లేదని యడ్యూరప్ప అన్నారు.
కర్ణాటకలో దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చిన జేడీఎస్- కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఆర్ఆర్ నగర్ లో బీజేపీ అభ్యర్థిని ఓడించడానికి ముందే ఒప్పందం కుదుర్చుకుని భారీ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టిందని యడ్యూరప్ప ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి మునిరాజు గౌడ ఓటమిపై యడ్యూరప్ప విచారం వ్యక్తం చేశారు .ప్రజల తీర్పును తాము గౌరవిస్తున్నామని యడ్యూప్ప చెప్పారు.