బలపరీక్షలో నెగ్గిన యడియూరప్ప.. 45 నిమిషాల్లోనే!
Recommended Video
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప శాసనసభలో తన బలాన్ని నిరూపించుకున్నారు. బలపరీక్షలో నెగ్గారు. మూజువాణి ఓటుతో ఆయన సభలో విశ్వాస పరీక్ష గండం నుంచి గట్టెక్కారు. దీనితో- ఇక భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఏర్పాటుకానుంది.
టార్గెట్..స్పీకర్: అవిశ్వాస తీర్మానానికి రెడీ?
ఈ వారాంతంలోగా యడియూరప్ప మంత్రివర్గాన్ని విస్తరించడం ఖాయమైంది. ఈ ఉదయం 11 గంటలకు యడియూరప్ప బలపరీక్ష తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) సభ్యులు మాట్లాడారు. చివరిగా- యడియూరప్ప ఈ తీర్మానంపై మాట్లాడారు. అనంతరం మూజువాణి ఓటుతో యడియూరప్ప బలపరీక్షలో నెగ్గినట్టు స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు.
బలపరీక్ష మొత్తం 45 నిమిషాల్లో పూర్తయింది. బీజేపీకి శాసనసభలో మొత్తం 105 మంది సభ్యుల బలం ఉంది. హాజరయ్యారు. 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్కుమార్ అనర్హత వేటు వేసిన నేపథ్యంలో- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం 103 పడిపోయింది. బీజేపీకి ప్రస్తుతం 105 సభ్యుల బలం ఉన్నందున.. ఈ బలపరీక్షలో అవలీలగా నెగ్గుకొచ్చింది.