వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీఎస్ఎఫ్ జవాను కాల్పులు: ఇద్దరు సహచరుల మృతి

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: ఓ బీఎస్ఎఫ్ జవాను ఇద్దరు సహచర జవాన్లను కాల్చి చంపాడు. ఈ ఘటన మంగళవారం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర దినాజ్‌పుర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ తర్వాత నిందితుడు అధికారుల వద్ద లొంగిపోయాడు.

ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులోని రాయ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ఓ ప్రాంతంలో బీఎస్ఎఫ్ క్యాంపు నడుస్తోంది. ఈ క్యాంపులో 146 బెటాలియన్‌కు చెందిన ఉత్తమ్ సూత్రధార్ అనే జవాను.. ఇన్‌స్పెక్టర్ మహిందర్ సింగ్ భట్టి, కానిస్టేబుల్ అనూజ్ కుమార్‌పై కాల్పులకు తెగబడ్డాడు.

 BSF Jawan Shoots Two Colleagues In North Bengal

ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా, కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు ఉత్తమ్ తమ కమాండర్ ఎదుట లొంగిపోయినట్లు రాయ్‌గంజ్ సూపరింటెండెంట్ సుమిత్ కుమార్ తెలిపారు.

ఈ కేసును రాయ్ గంజ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసినట్లు, తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు ఎస్పీ సుమిత్ వెల్లడించారు. అయితే, ఇద్దరు తోటి జవాన్లను ఉత్తమ్ ఎందుకు కాల్చి చంపాడనే విషయం ఇంకా తెలియరాలేదు.

English summary
Two BSF soldiers were shot dead by a constable of their unit in the early hours today in Bengal's North Dinajpur district. The unit's company commander had to persuade the constable for a long time to drop his weapon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X