తేజ్ బహదూర్ ను అరెస్టు చేయలేదు, బెటాలియన్ ను మార్చాం
తమకు సరైన ఆహరం పెట్టడం లేదంటూ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసిన బిఎస్ ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ను వేరే యూనిట్ కు తరలించినట్టుగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది.తేజ్ బహదూర్ యాదవ్ భార్
న్యూఢిల్లీ: తమకు సరైన ఆహారం పెట్టడం లేదంటూ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసి సైనికులకు పెట్టే భోజనంపై చర్చకు కారణమై, బిఎస్ఎప్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ను అరెస్టు చేయలేదని కేంద్ర హోంశాఖ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.అవసరాల రీత్యా ఆయనను వేరే చోటుకు బదిలీ చేసినట్టు డిల్లీ కోర్టుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ వివరించింది.
గత మూడు రోజులుగా తన భర్త జాడ కన్పించడం లేదంటూ ఆయనను కలిసేందుకు కూడ అధికారులు అనుమతి ఇవ్వడం లేదని ఆయన తేజ్ బహదూర్ యాదవ్ భార్య షర్మిళ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు సంబంధిత అధికారులను ప్రశ్నించింది.
తేజ్ బహదూర్ యాదవ్ సతీమణి షర్మిళను భర్తను ఎందుకు కలుసుకోకుండా అడ్డుకొంటున్నారని కోర్టు ప్రశ్నించింది.కొత్త బెటాలియన్ క్యాంప్ వీకెండ్ లో ఆయనను కలిసే అవకాశం ఇవ్వాలని అధికారులను కోర్టు ఆదేశించింది.
ప్రస్తుతం సాంబా సెక్టార్ లోని 88వ, బెటాలియన్ లో తేజ్ బహదూర్ యాదవ్ పనిచేస్తున్నట్టు హోంమంత్రిత్వశాఖ కోర్టుకు తెలిపింది.భోజనం సరిగా పెట్టడం లేదంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో అధికారులు తన భర్తను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని షర్మిల ఆరోపించింది.
తమకు సరైన ఆహారం పెట్టడం లేదంటూ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసి సైనికులకు పెట్టే భోజనంపై చర్చకు కారణమై, బిఎస్ఎప్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ను అరెస్టు చేయలేదని కేంద్ర హోంశాఖ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.అవసరాల రీత్యా ఆయనను వేరే చోటుకు బదిలీ చేసినట్టు డిల్లీ కోర్టుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ వివరించింది.