బిఎస్ఎఫ్ కాల్పుల్లో పాక్ డ్రగ్స్ స్మగర్లు హతం
ఛండీఘర్: పంజాబ్ రాష్ట్రం గత కొన్ని సంవత్సరాలుగా మాదక ద్రవ్యాల కేంద్రంగా మారుతోంది. కాగా, పంజాబ్లోని భారత్-పాక్ సరిహద్దు ప్రాంతంలో ఆదివారం ఉదయం స్మగ్లర్లపై భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు డ్రగ్స్ స్మగ్లర్లు హతమైనట్లు అధికారులు వెల్లడించారు.
పాక్ స్మగ్లర్ల నుంచి మాదకద్రవ్యాలను తీసుకునేందుకు వీరంతా ఖేమ్కరణ్ సెక్టార్కు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు భారత్ చెందినవారు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలి నుంచి 10కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇటీవల పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ.. భద్రతా సిబ్బంది గస్తీ ముమ్మరం చేశారు.
సరిహద్దు ప్రాంతమంతా తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్మగ్లర్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పఠాన్కోట్ దాడి సయంలోనూ పోలీసులు.. నలుగురు డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.