Budget 2020: బడ్జెట్లో సింహాభాగం వీటికే, ప్రజారోగ్యానికి పెరిగిన పద్దు
Recommended Video
వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పెద్దపీట వేశారు. వ్యవసాయం, నీటిపారుదల రంగానికి 2.83 లక్షల కోట్లను కేటాయించారు. రసాయన ఎరువుల నుంచి రైతులకు విముక్తి కలిగించడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. భూసార పరిరక్షణకు అదనపు సాయం అందజేస్తామని ప్రకటించారు. ఆరోగ్య రంగానికి కూడా రూ.69 వేల కోట్లు కేటాయించారు. గతేడాది కంటే రూ.5 కోట్ల నిధులను పెంచారు.
జలజీవన్కు 3.6 లక్షల కోట్లు..
జలజీవన్ మిషన్కు రూ.3.6 లక్షల కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి కోసం రూ.1.23 కోట్ల నిధులను అందజేస్తామని ప్రకటించారు. వృత్తి విద్య కోసం రూ.3 వేల కోట్లు కేటాయిస్తామని విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దీంతో విద్యార్థులకు సాంకేతికంగా దోహదపడుతోందని, ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు.
రవాణాకు 1.74 లక్షల కోట్లు
రవాణా రంగానికి 1.74 లక్షల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. దీంతో విమానయాన, రైలు, రహదారులను మరింత మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. 2023 నాటికి ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వే పూర్తిచేశామని పేర్కొన్నారు. నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ టెక్నాలజీ కోసం రూ.8 వేల కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. లక్ష గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తామన్నారు. ఇందుకోసం 6 వేల కోట్లను కేటాయించారు. పారిశ్రామిక, వాణిజ్య రంగాల కోసం రూ.27 వేల 300 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
ఎస్సీ, ఓబీసీల కోసం 85 వేల కోట్లు
ఎస్సీ, ఓబీసీల సంక్షేమం కోసం 85 వేల కోట్లు, గిరిజనుల కోసం 53 వేల 700 కోట్లను విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. జార్ఖండ్లో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుచేసేందుకు ప్రపొజల్ పెట్టారు. సీనియర్ సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం 9300 కోట్లు అలొకేట్ చేశారు. ఢిల్లీలో కాలుష్యం నివారణ కోసం కూడా కేంద్రం చర్యలు చేపట్టింది. రూ.4400 కోట్లను కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. జమ్ముకశ్మీర్ అభివృద్ధికి 30 వేల 757 కోట్లను కేటాయించారు.