వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీలకు ఫుడ్ సబ్సిడీ ఎత్తివేత -29నుంచి పార్లమెంట్ బడ్జెట్ భేటీ -క్వశ్చన్ అవర్‌కు ఓకే: స్పీకర్

|
Google Oneindia TeluguNews

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈనెల (జనవరి) 29 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన పార్లమెంటుకు సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించారు..

షాకింగ్: కొవాగ్జిన్ వద్దంటోన్న డాక్టర్లు -ప్రమాదం లేదని గ్యారంటీ ఏది? -మరో 45లక్షల డోసులకు కేంద్రం ఆర్డర్షాకింగ్: కొవాగ్జిన్ వద్దంటోన్న డాక్టర్లు -ప్రమాదం లేదని గ్యారంటీ ఏది? -మరో 45లక్షల డోసులకు కేంద్రం ఆర్డర్

బడ్జెట్ సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభలు రెండు సభలు రోజుకు ఐదేసి గంటల చొప్పున భేటీ అవుతాయని, రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్​సభ సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు సమావేశమవుతుందని తెలిపారు. ఈ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం(క్వశ్చన్ అవర్) ఉంటుందని స్పీకర్ స్పష్టం చేశారు. అయితే..

 Budget session from Jan 29, Question Hour to be allowed, end to subsidy on canteen food

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ఎంపీలందరూ తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, ఎంపీలకు ఇళ్ల వద్దనే ఆర్​టీపీసీఆర్ కోవిడ్-19 టెస్ట్ లు నిర్వహించేందుకు తగిన ఏర్పాటు చేసినట్లు స్పీకర్ బిర్లా తెలిపారు. ఎంపీల కుటుంబ సభ్యులు, సిబ్బందికీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పార్లమెంట్ ఆవరణలో జనవరి 27-28 తేదీల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా,

కన్నతండ్రి కామపిశాచిలా -పెద్ద కూతురిపై 7ఏళ్లుగా రేప్ -గర్భం తీయిస్తూ కిరాతకం -11ఏళ్ల చిన్న కూతురిపైనాకన్నతండ్రి కామపిశాచిలా -పెద్ద కూతురిపై 7ఏళ్లుగా రేప్ -గర్భం తీయిస్తూ కిరాతకం -11ఏళ్ల చిన్న కూతురిపైనా

పార్లమెంట్‌లోని క్యాంటిన్‌లోని ఆహార పదార్థాలపై ఎంపీలు, సిబ్బందికి 80శాతం సబ్సిడీ ఉంటుంది. ఆహార పదార్థాలపై ఏటా రూ.17 కోట్లు ఖర్చవుతుండగా.. వీటిలో దాదాపు రూ.14 కోట్లను పార్లమెంట్ సిబ్బంది, సందర్శకులే వినియోగించుకుంటున్నారు. ఎంపీలు తక్కువ మొత్తంలో వినియోగించుకున్నారు. అంతేకాదు చివరగా 2016లో మెనూ ధరలను సవరించారు. కోటాను కోట్ల ఆస్తులుండే ఎంపీలకు అతి తక్కువ ధరకే సబ్సిడీపై ఆహారం అందించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్ క్యాంటిన్‌లో ఆహార పదార్థాలపై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేశారు. ఈ విషయాన్ని స్పీకర్ బిర్లా తెలిపారు.

English summary
Lok Sabha Speaker Om Birla announces that amid COVID-19 pandemic, the Budget Session will commence from January 29. Rajya Sabha will sit from 9 am to 2 pm and Lok Sabha will sit be from 4 pm to 9 pm. Zero Hour and Question Hour will be held. Food served in Parliament canteens for MPs and others will become costlier as a subsidy given for it has been stopped, Lok Sabha Speaker Om Birla said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X