పుల్వామా జవానులకు నివాళులు... జవానుల ఇంటి మట్టితో మెమోరియల్ నిర్మాణం
దేశం మీద ఓక్కోక్కరిది ఓక్కో అభిమానం...దేశం మీద తమ అభిమానాన్ని చాటుకునేందుకు జాతీయతను చాటుకునే విధంగా పలు పలు సహాసాలు కార్యక్రమాలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని పలు ప్రాంతాలు తిరుగుతూ,విన్నూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు. ఈనేపథ్యంలో ఓ కళాకారుడు కూడ ఇలాంటి విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
గత ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా జిల్లాలో జరిగిన సీఆర్పీఎఫ్ దళాలపై మిలిటెంట్లు దాడులు చేసి నలబైమంది జవాన్లను పోట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే...దీంతో దేశ వ్యాప్తంగా మిలిటెంట్లపై వ్యతిరేకత వ్యక్తమయింది. ఇక ఈ దాడులకు ప్రతీకారంగానే భారత్ బాలాకోట్ సర్జికల్స్ట్రైక్ను నిర్వహించి జైష్ ఏ మహ్మద్ తీవ్రవాద శిక్షణ సంస్థలను మట్టుబెట్టింది. మరోవైపు పుల్వామా దాడిలో మృత్యువాత పడిన జవానులకు జాతి మొత్తం నివాళులు అర్పించింది.
అయితే ఓ కళకారుడు మాత్రం వారికి నివాళులు అర్పించేందుకు విన్నూత్న కార్యక్రమం చేపట్టాడు. పుల్వామా దాడిలో మృత్యువాత పడిన జవానుల ఇంటినుండి మట్టి సేకరిస్తున్నాడు. ఇలా నలబై మంది జవానుల ఇంటి నుండి సేకరించిన మట్టితో పుల్వామాలో ఇండియన్ మ్యాప్ రూపంలో ఓ మెమోరియల్ను నిర్మించనున్నట్టు తెలిపాడు. దీన్ని రానున్న ఫిబ్రవరి 14వరకు పూర్తి చేయనున్నట్టు తెలిపాడు.