వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద 50 మంది.. (వీడియో)

|
Google Oneindia TeluguNews

ముంబైలో ఘోరం జరిగింది. నాలుగంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు 50 మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. గతవారం కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న భవనం కుప్పకూలినట్లు తెలుస్తోంది.

డోంగ్రీలోని అబ్దుల్ హమీద్ దర్గా ప్రాంతంలోని తండేల్ స్ట్రీట్‌లో ఉదయం 11.40గంటల సమయంలో కేసర్‌భాయ్ అపార్ట్‌మెంట్ బిల్డింగ్ కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్‌లో ఎంత మంది ఉన్నారన్న వివరాలు తెలియలేదు. అయితే ప్రాథమిక అంచనా ప్రకారం 50 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అధికారులు అంటున్నారు.

Building Collapses In Mumbais Dongri, 50 Feared Trapped

బిల్డింగ్ కుప్పకూలిన విషయం తెలిసిన వెంటనే మున్సిపల్ అధికారులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక పోలీసుల సాయంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించేందుకు అంబులెన్స్‌లు సిద్దం చేశారు.

English summary
At least 50 people are feared trapped under debris after a four-storey building collapsed in Mumbai's crowded Dongri. NDRF personnel are at the site, looking for survivors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X