శక్తివంత జపాన్.. భారత్పై ఆధారపడి ఉంది: షింజో, బుల్లెట్ రైలు పనులకు శంకుస్థాపన
భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షిజో అబే గురువారం ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ రైలుకు శంకుస్థాపన చేశారు. ఈ రెండు నగరాల మధ్య 580 కిలో మీటర్ల మేర రైలు మార్గం.
Recommended Video
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షిజో అబే గురువారం ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ రైలుకు శంకుస్థాపన చేశారు. ఇద్దరు రిమోట్ ద్వారా పనులకు శ్రీకారం చుట్టారు. రెండు నగరాల మధ్య దూరం 508 కిలోమీటర్లు.
ప్రతిపాదిత బుల్లెట్ రైలు గంటకు 320 కిలోమీటర్ల నుంచి 380 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1.10 లక్షల కోట్లు. ఈ ప్రాజెక్టుతో 20 వేల మందికి ఉపాది కల్పన. ప్రాజెక్టు పూర్తయ్యాక 4వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. పరోక్షంగా 16వేల మందికి ఉపాధి ఉంటుంది.
ముంబై - అహ్మదాబాద్ మధ్య ప్రయాణానికి ప్రస్తుతం 8 గంటల సమయం పడుతుంది. బుల్లెట్ రైలు వచ్చాక ఆ సమయం మూడు గంటలకు తగ్గుతుంది. ఈ ప్రాజెక్టుకు జపాన్ అందించే రుణం రూ.88,000 కోట్లు.
I really like Gujarat & I really like India. I will do whatever I can for India: Japanese PM Shinzo Abe #BulletTrain pic.twitter.com/AUNZphsmOA
— ANI (@ANI) September 14, 2017
ఈ సందర్భంగా షింజో అబే మాట్లాడారు. శక్తివంతమైన జపాన్ అనేది భారత్ సంబంధాలపై ఆధారపడి ఉంటుందని, శక్తివంతమైన భారత్ అనేది జపాన్తో సంబంధాలపై ఆధారపడి ఉంటుందన్నారు. భారత్కు ఏం కావాలంటే అది చేస్తా అన్నారు.