రద్దు చేసిన నగదుతో పదేళ్ళ స్కూల్ ఫీజు చెల్లిస్తే , పీజులో రాయితీ పొందండి
ఒకేసారి పదేళ్ళపీజును రద్దు చేసిన నగదుతో చెల్లిస్తే ఫీజులో రాయితీ పొందవచ్చని బెంగుళూరులోని విఈఎస్ మోడల్ స్కూల్ ప్రకటించింది. స్కూల్ డవలప్ మెంట్ ఫండ్ పేరుతో ఈ నగదును స్వీకరించనున్నట్టు స్కూల్ ప్రకటించి
బెంగుళూరు : పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా ఆ నోట్లను ఎలా వదిలించుకోవాలనే వారికి బెంగుళూరులోని ఓ స్కూల్ బంఫర్ ఆపర్ ప్రకటించింది. ఒకేసారి పదేళ్ళ ఫీజును పాతనగదు నోట్ల రూపంలో చెల్లించవచ్చని ప్రకటించింది. అయితే ఓకేసారి పీజును చెల్లిస్తే ఫీజులో రాయితీని కూడ కల్పిస్తామని ప్రకటించింది.
పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా ప్రభుత్వ సంస్థలకు బాగానే గిట్టుబాటు అయింది. దేశంలోని అన్ని నగరపాలక సంస్థల కంటే హైద్రాబాద్ నగరపాలక సంస్థ కు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరింది. అయితే అదే తరహలో బెంగుళూరులోని ఓ ప్రేవేట్ స్కూల్ యజమాన్యం బంప్ ఆఫర్ ప్రకటించింది. ఒకేసారి పదేళ్ళ ఫీజును చెల్లిస్తే ఫీజులో రాయితీని కూడ కల్పిస్తామని ఆ స్కూల్ యాజమాన్యం ప్రకటించింది.
బెంగుళూరులోని
మాగడి
రోడ్డులోని
విఈస్
మోడల్
కాన్వెంట్
స్కూల్
లో
ఈ
స్కీమ్
ను
ప్రవేశపెట్టింది.
రద్దు
చేసిన
ఐదువందలు,
వెయ్యి
రూపాయాల
నగదు
నోట్లతో
చెల్లించవచ్చని
తేల్చి
చెప్పింది.పదేళ్ళ
ఫీజును
రద్దు
చేసిన
నగదుతో
కడితే
పీజులో
రాయితీని
కూడ
పొందే
అవకాశం
ఉంటుందని
స్కూల్
యాజమాన్యం
చెప్పింది.
బ్యాంకుల వద్దకు వెళ్ళి పాత నోట్లను మార్చుకోవడానికి ఇబ్బంది పడాల్సిన పనిలేదు. స్కూల్ ఫీజును ప్రతి ఏటా కట్టాల్సిన ఇబ్బందులు కూడ ఉండవు. అయితే ఫీజులో కూడ రాయితీని పొందే అవకాశం ఉండడంతో తల్లిదండ్రులు ఆసక్తిని చూపుతున్నారు. అయితే పెద్ద నగదు నోట్లను వదిలించుకోవాలనే వారికి ఈ ఆఫర్ పనికొస్తోంది. మరో వైపు ఈ ఫీజును డెవలప్ మెంట్ ఫండ్ పేరిట స్వీకరించనున్నట్టు స్కూల్ ప్రకటించింది.