బుర్హాన్ వనీ వారసుడు ఎన్ కౌంటర్: భారత్ తో పెట్టుకుంటే ఇదే గతి: పాక్ పని ఫినిష్ !
జమ్మూ కాశ్మీర్ లో అల్లకల్లోలం సృష్టిస్తున్న వేర్పాటువాద మిలిటెంట్ సంస్థ హిజ్బల్ ముజాహిద్దీన్ కు భారత్ ఆర్మీ తగినబుద్ది చెబుతోంది. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ స్థానంలో అతని వారసుడిగా పగ్గాలు చేపట్ట
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో అల్లకల్లోలం సృష్టిస్తున్న వేర్పాటువాద మిలిటెంట్ సంస్థ హిజ్బల్ ముజాహిద్దీన్ కు భారత్ ఆర్మీ తగినబుద్ది చెబుతోంది. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ స్థానంలో అతని వారసుడిగా పగ్గాలు చేపట్టిన మరో ఉగ్రవాది సబ్జార్ అహమ్మద్ భట్ ను కూడా భద్రతా దళాలు ఎన్ కౌంటర్ లో అంతం చేశాయి.
శనివారం జమ్మూ కాశ్మీర్ లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులు అంతం అయ్యారు. ఇందులో బుర్హాన్ వనీ వారసుడు సబ్జార్ అహమ్మద్ భట్ కూడా ఉన్నాడని భద్రతా దళాలు తెలిపాయి. పుల్వామా జిల్లాలోని ట్రాల్ సెక్టార్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు అంతం చేశాయి.
భారత్ ఆర్మీ దెబ్బకు ఒకే సారి సిక్స్
బారాముల్లా జిల్లాలోని రాంపూర్ సెక్టార్ లో ఎల్ వోసీ మీదుగా భారత్ లో చొరబాటుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు ఉగ్రవాదులను భారత్ భద్రతా దళాలు అంతం చేశాయి. ట్రాల్ లోని ఓ ఇంటిలో సబ్జార్ అహమ్మద్ భట్ అలియాస్ అబు జరార్, ఓ పాకిస్థానీ ఉగ్రవాది నక్కి ఉన్నారని భారత్ ఆర్మీ అధికారులకు సమాచారం అందింది.
రెచ్చిపోయి చచ్చిపోయారు
ఉగ్రవాదులు ఉన్న ఇంటిని భారత్ భద్రతా దళాలు చుట్టుముట్టాయి. లోంగిపోవాలని ఉగ్రవాదులను హెచ్చరించగా వారు రెచ్చిపోయి ఎదురుకాల్పులకు పాల్పడ్డారు. వెంటనే భద్రతా దళాలు ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో పాక్ ఉగ్రవాదితో సహ సబ్జార్ అహమ్మద్ భట్ ప్రాణాలు విడిచాడని భారత్ ఆర్మీ అధికారులు తెలిపారు.
ఉగ్రాదుల నిలయం బారాముల్లా
హిజ్బల్ కమాండర్ బుర్హాన్ వనీ కూడా భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యాకలాపాలు నిర్వహించాడు. భారత్ భద్రతా దళాలు జరిపిన ఎన్ కౌంటర్ లో బుర్హాన్ వనీ అంతం అయ్యాడు. ఆ సందర్బంలో కాశ్మీర్ లో ఘర్షణలు చెలరేగి హింస చోటుచేసుకుంది.
సమాచారం ఇచ్చిన ఇంటిలిజెన్స్
ఉడీకి సమీపంలోని రాంపూర్ లో ఉగ్రవాదులు తలదాచుకున్నారని భారత్ ఆర్మీ అధికారులకు సమాచారం అందింది. శనివారం వేకువ జామున ఎల్ వోసీ మీదుగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని గుర్తించిన ఆర్మీ అధికారులు అలర్ట్ అయ్యారు.
దాయాది పాక్ కు గట్టి గుణపాఠం
ఉడీ సెక్టార్ లో శుక్రవారం పాక్ బార్డర్ యాక్షన్ టీం (బ్యాట్)కు చెందిన ఇద్దరు చొరబాటుదారులు ఊడీ సెక్టార్ లో చోరబడానికి ప్రయత్నించడంతో వారిని సైన్యం ఏరిపారేసింది. చొరబాటు యత్నాన్ని సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇప్పుడు హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ అంతం కావడంతో పాక్ కు గట్టి గుణపాఠం చెప్పినట్లు అయ్యింది.