వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాజ్‌మహల్ వద్ద పిడకల మంట, బొగ్గు వాడకంపై నిషేధం

|
Google Oneindia TeluguNews

లక్నో: దేశంలో ప్రముఖ కట్టడమైన ఆగ్రాలోని తాజ్‌మహల్ సమీపంలో వంటకోసం మండించే కౌ డంగ్ కేక్స్ (ఆవుపేడతో చేసిన పిడకలు)లపై నిషేధం విధించారు. దీంతోపాటు తాజ్‌మహల్ ప్రాంతం సమీపంలో చిన్న తరహా పరిశ్రమలైన గాజుల తయారీ, స్వీట్‌ల తయారీలో మండించేందుకు ఉపయోగించే బొగ్గుపై కూడా నిషేధం విధించాలని జిల్లా యత్రాంగం యోచిస్తోంది.

వీటి వల్ల వాతావరణంలోకి విడుదలయే గోధుమ, నలుపురంగు కర్భన రేణువుల వల్ల తాజ్‌మహల్ పసుపు రంగును సంతరించుకుంటోందని అమెరికా పత్రికలు పేర్కొన్నట్టు డివిజనల్ కమిషనర్ ప్రదీప్ భట్నాగర్ తెలిపారు. ఈ నేపథ్యంలో పట్టణ పరిధిలో పిడకల వాడకంపై నిషేధం విధించినట్టు తెలిపారు.

Burning of Cow Dung Cakes, Coal Banned Near Yellowing Taj Mahal

అయితే పిడకల వాడకం నిషేధాన్ని అమలు చేయడం చాలా కష్టమైన పని అని చెప్పారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు పొందిన కట్టడాన్ని పరిరక్షేందుకు పిడకలను ఉపయోగించే వారిపై నగర్ నిగమ్ చట్టం ప్రకారం జరిమానా విధిస్తామని చెప్పారు.

నిరుపేదలు వంటచెరుకుగా ఉపయోగించుకునే పిడకలపై నిషేధం విధిస్తే వారికి ఇబ్బందులు ఎదురవుతాయని ప్రశ్నించగా.. వారికి ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇప్పిస్తామని ఆయన తెలిపారు. తాజ్‌మహల్ సమీపంలో తిరుగుతున్న 4వేలకు పైగా డీజిల్ ట్రక్కులను జులైలోగా సిఎన్‌జికి మార్చుకోవాలని యజమానులను కోరినట్లు తెలిపారు.

English summary
India's white marvel, the Taj Mahal, acquiring yellowish hues has prompted authorities in Agra to ban burning of cow dung cakes for cooking near the 17th century monument.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X