వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సు డ్రైవర్, కండక్టర్ రేప్ చేసి విద్యార్థిని చంపేశారు

By Pratap
|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో ఢిల్లీ నిర్భయ వంటి సంఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్, కండక్టర్ కాలేజీ విద్యార్థినిని అపహరించి, ఆమెపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. ఈ కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

నిందితులను సంతోష్ సాహు, విభూతి రౌత్‌లుగా గుర్తించారు. అమ్మాయిని బలమైన ఇనుప వస్తువుతో తలపై కొట్టి చంపేసిన తర్వాత శవాన్ని సంచీలో కుక్కి కటక్ జిల్లాలోని జటముండియా వద్ద గల మహానదిలో పడేశారు. ఆమె శవం ఆగస్టు 2వ తేదీన జటముండియా వంతెన కింద కనిపించింది.

ఆ క్రమంలో ఆ అమ్మాయి హత్య మిస్టరీ వీడింది. ఒడిషాలోని బంకీ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చేటు చేసుకుంది. నిందితులను విచారిస్తున్నామని, ఈ కేసులో ఇద్దరి కన్నా ఎక్కువ మంది నిందితులు ఉన్నారా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు అంటున్నారు.

Bus driver, conductor rape and murder college girl; arrested

పెళ్లి ఖరారు చేసుకోవడానికి అమ్మాయి పట్టుబట్టడంతో డ్రైవర్ విభూతి రౌత్‌తో కలిసి పథకం రచించాడు. ఆగస్టు 1వ తేదీన నిందితుడు పెళ్లి గురించి మాట్లాడడానికి అమ్మాయిని పిలిచాడు. ఆమె వచ్చిన తర్వాత ఆమెను బస్సులో రతగడ్ తీసుకుని వెళ్లి, అక్కడ ఆమెపై వాహనంలోనే అత్యాచారం చేశారు.

అమె వద్దని వేడుకున్నా వినకుండా ఆమెపై బలాత్కారం చేసి, ఐరన్ బార్స్‌తో మోది చంపేసి, శవాన్ని నదిలో పడేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.

English summary
A driver and a conductor of a private bus were on Friday arrested for abducting, raping, murdering a college-going girl.The accused were identified as Santosh Sahu and Bibhuti Rout.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X