బీహర్లో బస్సు ప్రమాదం, 10 మంది మృతి
పాట్నా:బీహార్ రాష్ట్రంలోని సీతారామర్హి జిల్లాలోని రున్ని సైద్పూర్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు వెళుతూ ప్రమాదవశాత్తు ఓ వంతెన పైనుండి కిందికి పడిపోయింది. శనివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ బస్సు ప్రమాదంలో దాదాపు 10 మంది వరకు మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.
ఇంకా ఈ బస్సు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రును వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
మరోవైపు ఈ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. బస్సు ఒక్కసారిగా అదుపుతప్పడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా ధ్రువీకరిస్తున్నారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.