Businessman: కోటీశ్వరులకే కోటీశ్వరుడు, 23వ అంతస్తు నుంచి దూకి ?, పక్కరూమ్ లో భార్య, మ్యాటర్?
ముంబాయి/జైపూర్: వ్యాపారం చెయ్యాలని అనుకున్న వ్యక్తి అతని సొంత రాష్ట్రం వదిలేసి దేశ ఆర్థిక రాజధానికి చేరుకున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ తో పాటు బిల్డర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. సొంత కంపెనీ స్థాపించిన వ్యాపారి కోట్ల రూపాయలు సంపాధించాడు. కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న వ్యాపారి పలు ప్రాజెక్టులు చేస్తున్నాడు. సొంత అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న 23వ అంతస్తులోకి వెళ్లిన వ్యాపారి కొన్ని గంటలు అక్కడే గడిపాడు. తరువాత జిమ్ రూమ్ టెర్రాస్ మీదకు వెళ్లిన వ్యాపారి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వందల కోట్ల రూపాయలకు అదిపతి అయిన ప్రముఖ బిల్డర్ ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన డోత్ నోట్ రాసాడని పోలీసు అధికారులు అంటున్నారు.
Cheating; కాలేజ్ స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ లో 7 రోజుల్లో రూ. 77 లక్షలు, మైండ్ బ్లాక్, అసలు మ్యాటర్?
రాజస్థాన్ టూ ముంబాయి
రాజస్థాన్ కు చెందిన పరాస్ పోవ్నాల్ (57) అనే వ్యక్తి చాలా సంవత్సరాల క్రితం వ్యాపారం చెయ్యాలని అనుకున్నాడు. రాజస్థాన్ లో అతను చెయ్యాలని అనుకున్న వ్యాపారం సక్సస్ కాదని తెలుసుకున్న పరాస్ నేరుగా ముంబాయి చేరుకుని అతను అనుకున్న లక్షం చేరుకోవాలని అనుకున్నాడు. పరాస్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఫేమస్ బిల్డర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి
కుటుంబ సభ్యులతో కలిసి పరాస్ చాలా సంతోషంగా గడిపేవాడని తెలిసింది. పరాస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. రియల్ ఎస్టేట్ తో పాటు బిల్డర్ గా మంచి పేరు తెచ్చుకున్న పరాస్ ఓం శాంతి డెవలపర్స్ అనే సొంత కంపెనీ స్థాపించి కోట్ల రూపాయలు సంపాధించడం మొదలుపెట్టాడు.
విలాసవంతమైన అపార్ట్ మెంట్
ప్రస్తుతం వందల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న వ్యాపారి పరాస్ పలు ప్రాజెక్టులు చేస్తున్నాడు. ముంబాయిలోని చించో ఫ్లోక్సీ రైల్వే స్టేషన్ సమీపంలోని శాంతి హౌసింగ్ సోసైటీ అపార్ట్ మెంట్స్ లోని 23వ అంతస్తులోని వివాలసవంతమైన ఫ్లాట్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి పరాస్ అతని భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.
23వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
శాంతి సోసైటీ అపార్ట్ మెంట్ లోని 23వ అంతస్తులోని సొంత ఫ్లాట్ లోని జిమ్ రూమ్ లోకి వేకువజామున పరాస్ వెళ్లాడు. వ్యాపారి పరాస్ రెండు గంటలు జిమ్ రూమ్ లోనే గడిపాడు. తరువాత వేకువ జామున 5 గంటల సమయంలో జిమ్ రూమ్ టెర్రాస్ మీదకు వెళ్లిన వ్యాపారి పరాస్ అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
శవం రోడ్డు పక్కనపడిపోయింది
23వ అంతస్తు టెర్రాస్ మీద నుంచి దూకడంతో పరాస్ రోడ్డు పక్కన పడిపోవడంతో స్పాట్ లో చనిపోయాడు. అటువైపు వెలుతున్న వాళ్లు శాంతి సోసైటీ అపార్ట్ మెంట్ సెక్యూరిటీ గార్డులకు సమాచారం ఇచ్చారు. వందల కోట్ల రూపాయలకు అదిపతి అయిన ప్రముఖ బిల్డర్ పరాస్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
కేసు దర్యాప్తు చెయ్యకూడదని డెత్ నోట్
ఆత్మహత్య చేసుకునే ముందు పరాస్ రాసిన డోత్ నోట్ ను జిమ్ రూమ్ లో స్వాధీనం చేసుకున్నామని, అందులో నా ఆత్మహత్యకు ఎవ్వరూ కారణంగా కాదు, నాకే జీవితంమై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నానని, ఈ కేసు దర్యాప్తు కూడా చెయ్యకూడదని, ఆత్మహత్య చేసుకునేలా తనను ఎవ్వరూ టార్చర్ పెట్టలేదని పరాస్ డెత్ నోట్ లో రాశాడని ముంబాయి పోలీసు అధికారులు అంటున్నారు.