కాంగ్రెస్లో మరో విషాదం: బూటా సింగ్ కన్నుమూత -గొప్ప పాలనా దక్షుడంటూ ప్రధాని మోదీ నివాళి
పంజాబ్ కు చెందిన బూటా సింగ్.. రాజీవ్ గాంధీ కేబినెట్ లో కేంద్ర హోం శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాతి కాలంలో కేంద్ర వ్యవసాయ మంత్రిగానూ సేవలందించారు. 1970, 80వ దశకాల్లో పంజాబ్ వేదికగా కొనసాగిన ఖలిస్థాన్ ఉద్యమాన్ని ఎదుర్కోవడంలో బూటా కీలక పాత్ర పోశించారు. స్వర్ణదేవాలయంలో సైనికచర్యగా పేరుపొందిన 'ఆపరేషన్ బ్లూ స్టార్'లోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు.
సెక్సీ ఫొటోలతో హారిక వలపువల -డేటింగ్ పేరుతో భారీ చీటింగ్ -భర్త సిక్ - కుటుంబ పోషణకు పక్కదారి
కాంగ్రెస్ యోధుడు బూటా సింగ్ మరణంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బూటా మరణం బాద కలిగించిందని, దేశంలో పేరెన్నిక గల గొప్ప పాలనా దక్షుల్లో ఆయన కూడా ఒకరని, ఈ విషాద సమయంలో బూటా కుటుంబీకులకు సంతాపం తెలుపుతున్నట్లు ప్రధాని మోదీ శనివారం ట్వీట్ చేశారు.
బూటా సింగ్ 1934, మార్చి 21న పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ జిల్లా ముస్తఫాపూర్ లో జన్మించారు. అకాలీదళ్ పార్టీ ద్వారా పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన 1960లోనే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పలు మార్లు ఎంపీగా గెలుపొంది, కేంద్ర మంత్రిగా సేవలందించారు. 1978లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన కీలక నేతగా మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా బూటా సింగ్ వ్యవహరించారు.