అభినందనలు: కైరానాలో మద్దతుతో ఆర్ఎల్డీ అభ్యర్థి గెలవడంపై బీజేపీ అభ్యర్థి స్పందన
కైరానా: ఉత్తర ప్రదేశ్కు కీలకంగా మారిన కైరానా లోకసభ ఉప ఎన్నికల్లో ఓటమిపై బీజేపీ అభ్యర్థి మృగాంకా సింగ్ స్పందించారు. బీజేపీకి చాలామంది ఓటేశారని వ్యాఖ్యానించారు. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీ, ఆమ్ ఆద్మీ పార్టీ, లెఫ్ట్ పార్టీలతో కూడిన కూటమి కారణంగా అలెయన్స్ అభ్యర్థి తబస్సుం గెలిచారన్నారు.
Recommended Video
ఆర్ఎల్డీ తరఫున గెలిచిన తబస్సుంకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్షాలు అన్ని ఒక్కటిగా బీజేపీపై పోటీ చేస్తున్నాయన్నారు. ప్రతిపక్షాలు అన్ని కలిసి బీజేపీకి సవాల్ విసురుతున్నాయని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు కలిస్తే ఎలా ముందుకు వెళ్లాలో ప్రిపేర్ అయ్యేందుకు ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు.
కాగా, గత సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో బీజేపీ ఏకంగా 70కి పైగా లోకసభ సీట్లు గెలుచుకుంది. అప్పటి నుంచి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాలు కోల్పోయింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థానాలు ఖాళీ కావడంతో అక్కడ గతంలో ఉప ఎన్నికలు జరిగాయి. అక్కడ బీజేపీ ఓడిపోయింది. విపక్షాలు ఏకమయ్యాయి. ఇప్పుడు కూడా విపక్షాలు ఏకం కావడంతో కైరానాలో గెలిచారు.