మరోసారి మోడీ సమావేశానికి డుమ్మా కొట్టనున్న మమతా బెనర్జీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆహ్వానాన్ని మరోసారి తిరస్కరించింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రీ మమతా బెనర్జీ. ప్రధాన మంత్రి నేతృత్వంలో బుధవారం కొనసాగనున్న సమావేశానికి ఆమే హజరు కాలేని స్పష్టం చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రీ ప్రహ్లాద్ జోషికి లేఖ రాసింది. కాగా ''వన్ కంట్రీ, వన్ నేషన్ '' అంశంపై చర్చించేందుకు దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులకు ఆహ్వానం పంపింది. అయితే ఈ సమావేశంలో తీసుకున్న ఎజెండాపై చర్చించేందుకు సరైన సమయం లేదని లేఖలో పేర్కోంది.
కాగా బుధవారం జరిగే సమావేశంలో చర్చించే అంశానికి సరైన సమయం ఇచ్చి, పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించింది. దీంతో పార్టీ బీజేపీ తీసుకోబోయె చర్యలపై కూడ శ్వేత పత్రం విడుదల చేయాలని కోరింది. సమయం లేకుండా చర్చించే అంశాల్లో సరైన ఫలితాలు ఇవ్వవని తెలిపింది. మరోవైపు మహత్మాగాంధీ 150 జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న కారణంగా రాలేకపోతున్నట్టు తెలిపింది.
కాగా ఇదివరకే నీతీ ఆయోగ్ సమావేశానికి అధికారికంగా ఆహ్వనం అందినా మమతా మాత్ర్ ఆ సమావేశానికి హజరయ్యోందుకు నిరాకరించారు. నీతి ఆయోగ్ రాష్ట్ర్రాలకు సంబంధించిన అంశాలపై ఫోకస్ పెట్టలేదని దాని వల్ల రాష్ట్ట్రాలకు ఎలాంటీ ప్రయోజనం లేదని స్పష్టం చేసింది. మరోవైపు మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడ హజరయ్యోందుకు నిరాకరించింది మమతా బెనర్జీ.