అవినీతిని తగ్గిచేందుకే: జైలు శిక్షను ఏడేళ్లకు పెంచిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: లంచం కేసులను క్రూరమైన నేరాల జాబితాలో చేర్చుతూ, లంచం తీసుకునే అధికారులకు విధిస్తున్న ఐదేళ్ల జైలు శిక్షను ఏడేళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా అవినీతి వ్యతిరేక చట్టంలో చేసిన సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
తాజా సవరణలతో 1988నాటి అవినీతి వ్యతిరేక చట్టానికి రెక్కలొచ్చాయి. దీంతో లంచం ఇచ్చినా, తీసుకున్నా నేరంగానే పరిగణిస్తారు. గతంలో లంచం తీసుకున్న కేసుల్లో ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేవారు. ఇప్పుడు పరిమితిని ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం పత్రికా ప్రకటన విడుదల చేసింది.
అంతేకాదు అవినీతి కేసులకు త్వరగా ముగించడంతో పాటు, రెండు సంవత్సరాల కాలపరిమితిని విధించింది. గత నాలుగు సంవత్సరాల్లో పీసీ చట్టం కింద అవినీతి ట్రయిల్ కేసులు ఎనిమిది సంవత్సరాలుగా ఉండేది. తాజా సవరణలతో విచారణను రెండు సంవత్సరాల లోపల పూర్తి చేసి అందించాలని ప్రతిపాదించింది.
దేశంలో అవినీతి తగ్గించేందుకు గాను 2013 నుంచి రాజ్యసభలో పెండింగ్లో ఉన్న ఈ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.