హైప్రొఫైల్ సెక్స్ స్కాండల్: బాలీవుడ్ స్టార్స్, మాజీ సీఎం, గవర్నర్, టాప్ పొలిటీషన్స్ విటులే!
భోపాల్: మధ్యప్రదేశ్లో భారీ బ్లాక్ మెయిల్ కుంభకోణం బయటపడింది. 40 మంది కాల్ గర్ల్స్ తోపాటు పలువురు బాలీవుడ్ బీ గ్రేడ్ నటీమణులు.. అధికారులు, రాజకీయ నాయకులతోపాటు మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ కూడా ఈ బ్లాక్ మెయిల్ స్కాండెల్ చిక్కుకోవడం గమనార్హం.
మింగలేక కక్కలేక..
ఈ భారీ బ్లాక్ మెయిలింగ్ సిండికేట్లో వీరంతా చిక్కుకుని మింగలేక కక్కలేక ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. ఆ మగువలతో గడిపిన సమయంలో తీసిన 92 హైక్వాలిటీ వీడియో క్లిప్స్ ఇప్పుడు అధికారులు, రాజకీయ నాయకులకు నిద్రలేని రాత్రులను మిగిలుస్తున్నాయి.
నిర్వాహకులు మహిళలే..
కాగా, మధ్యప్రదేశ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజీవ్ షమి ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక బృందం ఈ హనీట్రాప్ బ్లాక్ మెయిలింగ్ కుంభకోణాన్ని ఛేదించింది. కొందరు మహిళలే ఈ సెక్స్, బ్లాక్ మెయిలింగ్ రాకెట్ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వీడియోలన్నింటినీ సేకరించి ఎక్కడ్నుంచి అప్లోడ్ చేశారని విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్దేశ పూర్వకంగానే..
మధ్యప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తమ పార్టీకి చెందిన నాయకులను ఈ హానీ ట్రాప్లో పడేస్తున్నారని, ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయ్ వర్జియా. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధికారి డీ శ్రీనివాస్కు సంజీవ్ షమీకి ఈ కేసు బాధ్యతలను అప్పగించారు.
కాల్ గర్ల్స్తో..
కాగా, ఈ సెక్స్ రాకెట్ ప్రధాన నిర్వాహకురాలు శ్వేతా స్వప్నిల్ జైన్ను సిట్ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు సమాచారం. ప్రభుత్వంలోని కీలక అధికారులు, రాజకీయ నాయకులే లక్ష్యంగా అద్దెకు తెచ్చిన కాల్ గర్ల్స్తో శ్వేతా జైన్ హనీట్రాప్ చేయిస్తున్నారని తేల్చారు.
ఆ సమయంలో వీడియోలు తీసి..
మొదట అధికారులు లేదా రాజకీయ నాయకులతో శ్వేత మాట్లాడుతుంది. గెస్ట్ హౌస్ లేదా ఫైవ్ స్టార్ హోటల్లో అమ్మాయిలను పెట్టి.. అక్కడికి వీరిని తీసుకెళుతుంది. అధికారులు, రాజకీయ నాయకులు అక్కడికి వెళ్లి వారితో శృంగారంలో పాల్గొంటే.. ఆ సమయంలో వారి వీడియోలను మొబైల్ లేదా స్పై కెమెరాల ద్వారా చిత్రీకరించి వారిని బ్లాక్ మెయిల్ చేస్తుంది. శ్వేత జైన్ భర్త స్వప్నిల్ జైన్ వద్ద మొత్తం ఐదు హార్డ్ డిస్క్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
బాలీవుడ్ తారలు కూడా..
ముంబై లేదా ఢిల్లీకి అధికారులు, రాజకీయ నాయకులు వెళ్లిన సమయంలో వారికి మోడళ్లు, బాలీవుడ్ నటీమణులను వారి డిమాండ్ల మేరకు ఏర్పాటు చేస్తుందీ శ్వేత. సిట్ సీజ్ చేసిన వీడియోల్లో కొందరు బీ గ్రేడ్ బాలీవుడ్ తారలు కూడా ఉన్నట్లు సమాచారం.
రూ. కోట్లలో కాంట్రాక్టులు
మంత్రి లేదా సెక్రటరీ లాంటి వారు తమ హానీ ట్రాప్లో పడితే వారి నుంచి తను నడిపిస్తున్న ఎన్జీఓ సంస్థకు కాంట్రాక్టులను కూడా తెచ్చుకుంటుంది శ్వేత. పోలీసుల విచారణలో ఈ మేరకు ఆమె అంగీకరించింది. తన భర్త నడిపే ఎన్జీఓ సంస్థకు రూ. 8 కోట్ల కాంట్రాక్టును భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పొందినట్లు శ్వేత వెల్లడించింది. పీడబ్ల్యూడీ, హౌసింగ్, సోషల్ వెల్ఫేర్, ఇతర ప్రభుత్వ కార్పొరేషన్ల నుంచి కొన్ని కోట్ల రూపాయల కాంట్రాక్టులను శ్వేత, ఆమె భర్త దక్కించుకోవడం గమనార్హం.
80శాతం బీజేపీ, 20శాతం కాంగ్రెస్ నేతలు..
అంతేగాక, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఒకరు తనకు భోపాల్ పోష్ ప్రాంతంలోని మినల్ రెసిడెన్సీలో ఓ బంగ్లాను కానుకగా ఇచ్చారని శ్వేత చెప్పడం గమనార్హం. భోపాల్, ఇండోర్ లతోపాటు మధ్యప్రదేశ్లోని ముఖ్య ప్రాంతాల్లో ఈ సెక్స్ రాకెట్ కార్యకలాపాలు కొనసాగాయని, మాజీ మంత్రులు, అధికారులు ఈ కూపంలో చిక్కుకున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేకే మిశ్రా తెలిపారు. కొన్ని సంవత్సరాలు ఈ సెక్స్ రాకెట్ కొనసాగుతోందని, ఈ స్కాండిల్లో చిక్కుకున్న వారిలో 80శాతం మంది బీజేపీవారేనని చెప్పుకొచ్చారు. పోలీసుల వద్ద అందరి పేర్లు ఉన్నాయని, అయితే, ఇప్పటి వరకు పేర్లు బయటపెట్టలేదని, అరెస్ట్ చేయలేదని అన్నారు. మరో 20శాతం మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూడా ఈ హానీట్రాప్లో చిక్కుకున్నారని మిశ్రా తెలిపారు. నేరం రుజువైతే కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా అరెస్ట్ చేశామని చెప్పుకొచ్చారు.
స్పై కెమెరాలో రికార్డింగ్.. భారీ మొత్తంలో బ్లాక్ మెయిల్..
శ్వేత జైన్ తోపాటు ఆర్తి దయాల్ అనే మరో మహిళను కూడా సిట్ అరెస్ట్ చేసింది. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి సాయంతో మంత్రులను కలిసిన ఆర్తి దయాల్.. వారిని ఈ సెక్స్ స్కాండెల్లో ఇరికించింది. సదరు ఐఏఎస్ అధికారి భోపాల్లో తనకు ఓ ఫ్లాట్ ఇచ్చాడని, అక్కడ్నుంచి తన కార్యకలాపాలను కొనసాగించినట్లు తెలిపింది. తమ వద్దకు వచ్చే రాజకీయ నాయకులు, అధికారులు అమ్మాయిలతో శృంగారంలో పాల్గొనే సమయంలో స్పై కెమెరాలతో వీడియోలు తీస్తామని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతామని తెలిపింది.
హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్..
కాగా, దర్యాప్తులో లభించిన ఆ వీడియోలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపింది సిట్. సిండికేట్ తరహాలో ఈ బ్లాక్ మెయిల్ వ్యవహారం నడుస్తోందని సిట్ గుర్తించింది. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇదో హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్, బ్లాక్ మెయిల్ స్కాండెల్ అని చెప్పుకొచ్చారు.