వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ష్ ... గప్ చుప్.. ముగిసిన తుది విడత ప్రచారం..! ఎక్కడికక్కడ మూగబోయిన మైకులు..!!

|
Google Oneindia TeluguNews

దిల్లీ: ఓ ప్రహసనం ముగిసింది. 2019 సాధారణ ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవిత స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా నిక్షిప్తమైంది. ఏడో విడత సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి గడువు శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 19న లోక్‌సభ తుది విడత ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఏడో విడతలో 8 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. ఈ నెల 19న పోలింగ్‌ ముగిశాక, సాయంత్రం 6 గంటల అనంతరం ఎగ్జిట్‌పోల్స్‌ వెలువడనున్నాయి. ఈ నెల 23న లోక్‌సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

campaign ended..! mic sounds finished..!

ఉత్తర్‌ ప్రదేశ్‌లో కీలకమైన 13 స్థానాలకు చివరి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నియోజకవర్గాల్లో 167 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాని మోదీ పోటీ చేస్తోన్న వారణాసి నియోజకవర్గం కూడా చివరి విడత ఎన్నికల బరిలోనే ఉంది. దీంతోపాటు పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు, పశ్చిమ బంగాల్‌లోని 9 స్థానాలకు, బిహార్‌లో 8 పార్లమెంటు స్థానాలకు, మధ్యప్రదేశ్‌లోని 8 స్థానాలకు, హిమాచల్‌ ప్రదేశ్‌లో 4, ఝార్ఖండ్‌లో 3, ఛండీగఢ్‌లో ఒక స్థానానికి చివరి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, శత్రుఘ్నసిన్హా, హర్‌ సిమ్రత్‌ కౌర్‌ తదితరులు ఈ విడతలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

English summary
The seventh phase campaign ended on Friday evening. The final phase of the Lok Sabha elections will be held on 19th of this month. In seven constituencies, polling will be held in 59 constituencies in eight states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X