కొత్త ఉత్సాహం: సోనియాతో ఖుష్బూ క్లిక్ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో చేరడం తమిళనాడులో ఆ పార్టీ క్యాడర్కు కొత్త ఉత్సాహం ఇచ్చింది. ఇటీవలి వరకు డీఎంకేలో ఆమె ముఖ్య నేతగా ఉన్నారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోను నిరూపించుకున్న ఖుష్బూ చేరిక 'చేతి'కి కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ భావిస్తోంది.
బుధవారం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన ఖుష్బూ, అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరుతున్నారని విలేకరులు ప్రశ్నిస్తే.. ఇప్పుడు ఎందుకు చేరకూడదని ఆమె మీడియాను ఎదురు ప్రశ్నించారు.
సోనియా సమక్షంలో తాను పార్టీలో చేరానని ఆమె తెలిపారు. తమిళనాట కాంగ్రెస్ పార్టీ బలపడుతుందన్నారు. ఇప్పుడు తనకు తన సొంతింటికి వచ్చిన భావన కలుగుతోందన్నారు. అదే సమయంలో డీఎంకే పార్టీ పైన నిప్పులు చెరిగారు. తనకు ఆ పార్టీ తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు. తమ కుటుంబ సభ్యులు మొదటి నుండి కాంగ్రెస్ అభిమానులే అన్నారు.
ఖుష్బూ
ప్రముఖ సినీ నటి ఖుష్బూ బుధవారం నాడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
విలేకరులతో ఖుష్బూ
బుధవారం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన ఖుష్బూ, అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.
ఖుష్బూ
ప్రముఖ సినీ నటి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో చేరడం తమిళనాడులో ఆ పార్టీ క్యాడర్కు కొత్త ఉత్సాహం ఇచ్చింది. ఇటీవలి వరకు డీఎంకేలో ఆమె ముఖ్య నేతగా ఉన్నారు.
ఖుష్బూ
సినిమాలతో పాటు రాజకీయాల్లోను నిరూపించుకున్న ఖుష్బూ చేరిక 'చేతి'కి కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ భావిస్తోంది. కాగా, తాను బీజేపీలో చేరుతున్నట్లుగా వచ్చిన వార్తల పైన ఆమె అంతకుముందు మండిపడ్డారు.