క్యాన్సర్ బాధితురాలిపై గ్యాంగ్ రేప్, రోడ్డుపక్కన పడేశారు
లక్నో: క్యాన్సర్ బాధితురాలిపై ఓ గుంపు సామూహిక అత్యాచారానికి పాల్పడింది. 16 ఏళ్ల బాలికపై దుండగులు లక్నోలో శనివారం గ్యాంగ్ రేప్ చేశారు. బాలిక రుకులు కొనడానికి వెళ్లిన బాలికను తెలిసిన వ్యక్తి ఒకతను తనతో తీసుకుని వెళ్లాడని సరోజినీ నగర్ సర్కిల్ ఆఫీసర్ లలితా ప్రసాద్ చెప్పారు.
అతనితో పాటు అతని మిత్రులు ఆమెపై అత్యాచారం చేసి ఆమెను రోడ్డు పక్కన పడేసి వెళ్లారు. ఒకే రోజు ఆమె రెండుసార్లు అత్యాచారానికి గురైంది. సాయమడిగినందుకు ఆమెపై దారి వెళ్లేవారు కూడా అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరు ఇద్దరు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఓ నిందితుడు విరేంద్ర యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా, మూడో నిందితుడు పరారీలో ఉన్నాడు. రాష్ట్రంలో గత వారం ఓ మైనర్పై అత్యాచారం జరిగిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. తుపాకి గురిపెట్టి 17 ఏళ్ల బాలికను మాఝగావ్లో గ్యాంగ్ రేప్ చేశారు.