ఏటీఎం 'క్యూ' మీదకు దూసుకెళ్లిన కారు: ముగ్గురికి సీరియస్..
మహారాష్ట్రలోని షోలాపూర్ లో.. ఓ ఏటీఎం ముందు భారీ జనసందోహం బారులు తీరి ఉండగా.. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు వారిని నేరుగా ఢీకొట్టింది.
షోలాపూర్: దేశంలో కరెన్సీ కష్టాలు సామాన్యులను అల్లాడిస్తున్నాయి. ఎక్కడ చూసినా.. చాంతాడంతా 'క్యూ'లు దర్శనమిస్తుండడంతో.. పనులను సైతం పక్కనబెట్టి గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి. అంతసేపు వేచియున్నా!.. నగదు చేతికందుతున్న భరోసా లేకుండా పోయింది.

ఇవన్నీ పక్కనబెడితే.. క్యూ లైన్లలో ఘర్షణలు.. పోలీసుల లాఠీ చార్జీలు, ఓపిక నశించి ఖాతాదారులు బ్యాంకు అద్దాలను ధ్వంసం చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మరో విషాద ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని షోలాపూర్ లో.. ఓ ఏటీఎం ముందు భారీ జనసందోహం బారులు తీరి ఉండగా.. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు వారిని నేరుగా ఢీకొట్టింది.
దీంతో క్యూ లైన్లలో నిలబడి వున్న 15మందికి గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరెన్సీ కష్టాల నేపథ్యంలో ఇంకెన్ని దుర్ఘటనలు చోటు చేసుకుంటాయోనన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications