ఏటీఎం 'క్యూ' మీదకు దూసుకెళ్లిన కారు: ముగ్గురికి సీరియస్..
మహారాష్ట్రలోని షోలాపూర్ లో.. ఓ ఏటీఎం ముందు భారీ జనసందోహం బారులు తీరి ఉండగా.. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు వారిని నేరుగా ఢీకొట్టింది.
షోలాపూర్: దేశంలో కరెన్సీ కష్టాలు సామాన్యులను అల్లాడిస్తున్నాయి. ఎక్కడ చూసినా.. చాంతాడంతా 'క్యూ'లు దర్శనమిస్తుండడంతో.. పనులను సైతం పక్కనబెట్టి గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి. అంతసేపు వేచియున్నా!.. నగదు చేతికందుతున్న భరోసా లేకుండా పోయింది.

ఇవన్నీ పక్కనబెడితే.. క్యూ లైన్లలో ఘర్షణలు.. పోలీసుల లాఠీ చార్జీలు, ఓపిక నశించి ఖాతాదారులు బ్యాంకు అద్దాలను ధ్వంసం చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మరో విషాద ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని షోలాపూర్ లో.. ఓ ఏటీఎం ముందు భారీ జనసందోహం బారులు తీరి ఉండగా.. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు వారిని నేరుగా ఢీకొట్టింది.
దీంతో క్యూ లైన్లలో నిలబడి వున్న 15మందికి గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరెన్సీ కష్టాల నేపథ్యంలో ఇంకెన్ని దుర్ఘటనలు చోటు చేసుకుంటాయోనన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications