ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ కామెంట్: కార్టునిస్టులను చేతినిండా పని, వైరల్ !
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పుడు కార్టునిస్టులకు చేతినిండా పని పెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ మీద విమర్శలు చేసిన యువరాజు రాహుల్ గాంధీపై కొందరు కార్టునిస్టులు సెటైర్లు వేస్తున్నారు. సతీష్ ఆచార్య వేసిన కార్డున్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మోడీ మీద కామెంట్
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ బండిని వెనుక నుంచి అద్దంలో చూస్తూ ముందుకు నడుపుతున్నారని, అందుకే భారతదేశం అభివృద్దిలో వెనుకపడిపోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
Recommended Video
ఉచిత సలహా
సీఎం సిద్దరామయ్య తన రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందు నుంచి చూసి నడుపుతున్నారని, అందుకే కర్ణాటక రాష్ట్రం అభివృద్ది విషయంలో దూసుకుపోతుందని రాహుల్ గాంధీ అన్నారు. అభివృద్ది ఎలా చెయ్యాలి అని సిద్దరామయ్యను చూసి మోడీ నేర్చుకోవాలని రాహుల్ గాంధీ ఉచిత సలహా ఇచ్చారు.
రాహుల్ గాంధీపై బీజేపీ
ఓ పక్క రాహుల్ గాంధీ మీద బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మీద రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కార్టునిస్టులకు చేతినిండా పని పెట్టారు. యువరాజు వ్యాఖ్యలపై పలువురు ప్రముఖ కార్టునిస్టులు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.
రాహుల్ గాంధీ అంటే
ప్రముఖ కార్టునిస్టు సతీష్ ఆచార్య రాహుల్ గాంధీ వరుస కార్టున్లు వేస్తున్నారు. సోమవారం ఓ కార్టున్ వేసిన సతీష్ ఆచార్య మంగళవారం రాహుల్ గాంధీ సైటర్ మీద తన చేతికి పనిపెట్టారు. రాహుల్ గాంధీనీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మోసుకు వెలుతున్న కార్టున్ ను సతీష్ ఆచార్య వెయ్యడంతో ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.