భగత్ సింగ్పై అనుచిత వ్యాఖ్యలు: గాంధీ మునిమనవడిపై కేసు నమోదు
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీపై జలంధర్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడైన భగత్ సింగ్పై అనుచితి వ్యాఖ్యలు చేసినందుకు గాను పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
జైపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో భగత్ సింగ్ను కించపరిచేలా తుషార్ గాంధీ మాట్లాడారని, ఆయనపై కేసు నమోదు చేయాలని బీజేజీ నేత, 'జన్ జాగృతి మంచ్' అనే స్వచ్చంధ సంస్ధ నిర్వాహకుడు అయిన కిషన్ లాల్ శర్మ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ క్రమంలో తుషార్ గాంధీపై ఐపీసీ సెక్షన్ 295 (ఏ) కింద కేసు నమోదు చేశారు. మత విశ్వాసాలకు భంగం కలిగించే చర్యలకు సంబంధించి ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. మే 8వ తేదీన జైపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో తుషార్ గాంధీ మాట్లాడుతూ, "బ్రిటీష్ ప్రభుత్వం భగత్ సింగ్ను క్రిమినల్గా పరిగణించింది. అందుకే అతనికి పడ్డ మరణశిక్షను రద్దు చేయాలని గాంధీ కోరలేదు" అని సంచలన వ్యాఖ్యలు చేశారు.