వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోలీ వేళ.. ఢిల్లీలో రక్తపాతం: యువకుడిని 50సార్లు కసితీరా పొడిచారు..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హోలీ పండుగ పూట దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. 20ఏళ్ల ఓ టీనేజర్ పై కొంతమంది దుండగులు కత్తులతో దాడి చేశారు. దాదాపు 50కత్తిపోట్లకు గురైన ఆ యువకుడు ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

రెండు పెళ్లిళ్లు.. బోలెడు ఎఫైర్స్: చదివింది ఆరే.. అమ్మాయిపై కన్నేస్తే అంతే!రెండు పెళ్లిళ్లు.. బోలెడు ఎఫైర్స్: చదివింది ఆరే.. అమ్మాయిపై కన్నేస్తే అంతే!

ఎవరా వ్యక్తి?:

ఎవరా వ్యక్తి?:

గురువారం సాయంత్రం 4గం. ఎప్పటిలాగే జిమ్ నుంచి ఇంటికి బయలుదేరాడు ఆశిష్. మార్గమధ్యలో 20మంది దుండగులు ఒక్కసారిగా అతనిపై దాడి చేశారు.

దుగ్గల్ కాలనీలోని ఇరుకు సంధుల్లో ఆశిష్‌ను పట్టుకుని విచక్షణారహితంగా దాడి చేశారు. నలుపు రంగు షర్ట్ ధరించి ఉన్న ఆశిష్ ను మొదట ఒద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు. ఆపై దాదాపు 10బైకులపై మరికొంతమంది అక్కడికి చేరుకుని ఆశిష్ ను చుట్టుముట్టారు.

 50కత్తిపోట్లు..:

50కత్తిపోట్లు..:

ఆశిష్ ను చుట్టముట్టడమే ఆలస్యం తమ వద్ద ఉన్న కత్తులతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దాదాపు 50సార్లు అతన్ని కత్తితో పొడిచారు. అలాగే ఓ ఇనుప రాడుతో తీవ్రంగా గాయపరిచారు. దాడికి సంబంధించిన దృశ్యాలన్ని సీసీటివి కెమెరాలో రికార్డయ్యాయి. దాడి అనంతరం ఆశిష్ రోడ్డుపై పడిపోగా.. దుండగులు కత్తులు, రాడ్లు తీసుకుని అక్కడినుంచి పరార్ అయ్యారు.

 విషమంగా ఆశిష్‌ పరిస్థితి..:

విషమంగా ఆశిష్‌ పరిస్థితి..:

దాడి అనంతరం ఆశిష్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆశిష్ శరీరంపై 50వరకు కత్తిపోట్ల ఆనవాళ్లు ఉన్నాయని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని, మరికొద్ది గంటలు గడిస్తే గానీ ఏమి చెప్పలేమని స్పష్టం చేశారు.

 దాడి వెనుక కారణాలు?:

దాడి వెనుక కారణాలు?:

ఆశిష్‌పై దాడికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే గురువారం కంటే ముందు జరిగిన ఓ గొడవే ఇందుకు కారణమని స్థానికులు చెబుతున్నారు. వాటర్ బెలూన్స్ తమపై విసిరేసినందుకు ఆ దుండగులు ఒక బాలుడిని కొట్టారని, ఆ సమయంలో ఆశిష్ వాళ్లను అడ్డుకున్నాడని, బహుశా దానికి ప్రతీకారంగానే ఇప్పుడు దాడి చేసి ఉండవచ్చునని వారు చెబుతున్నారు.

English summary
A man in his mid-twenties was stabbed at least 50 times and beaten with rods by a group of men on motorcycles in south Delhi's Khanpur area on Thursday evening. The brazen attack was caught on camera. A complaint has been filed against unknown men, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X