కావేరీ చిచ్చు: విజయకాంత్కు అస్వస్థత, భార్య ప్రేమలత దీక్ష
చెన్నై: కావేరీ జలాల వ్యవహారంలో కర్నాటక వైఖరిని నిరసిస్తూ నిరాహార దీక్ష చేపడతానని ప్రముఖ నటుడు, డిఎండికె అధినేత విజయకాంత్ మూడు రోజుల క్రితం ప్రకటించారు. అయితే, ఆయన నిరాహార దీక్ష చేపట్టలేదు. దీంతో, ఆయన దీక్ష చేపడతానని చెప్పి మాయమయ్యాడని వార్తలు వచ్చాయి
కానీ, విజయకాంత్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకు బదులుగా ఆయన సతీమణి, డీఎండీకే మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రేమలత దీక్ష చేపట్టారు.

డీఎండీకే ప్రధాన కార్యాలయంలో ఒక్కరోజు పాటు దీక్ష చేపడతానని తొలుత విజయకాంత్ ప్రకటించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి దీక్షకు దిగాల్సి ఉంది. ఆయనకు బదులుగా ప్రేమలత దీక్షబూనారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. కొద్దిరోజులుగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం విజయకాంత్ పలు జిల్లాల్లో పర్యటించడంతో అనారోగ్యానికి గురయ్యారని, నిరాహారదీక్ష చేస్తే ఆరోగ్యం మరింత విషమిస్తుందని వైద్యులు చెప్పడంతో ఆయన దీక్షకు రాలేకపోయారన్నారు. తమిళుల ఆగ్రహావేశాలను రెచ్చగొట్టేలా కన్నడిగులు వ్యవహరిస్తున్నారన్నారు. కర్ణాటకతో పాటు ఏపీ, కేరళ రాష్ట్రాలు కూడా తమిళులకు ద్రోహం తలపెడుతున్నాయన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించాలన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications