వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కావేరి వివాదంపై కర్ణాటక కొత్త వాదన : 'బాకీ కింద రాసేసుకోండి!'

|
Google Oneindia TeluguNews

బెంగుళూరు : కావేరి జల వివాదానికి సంబంధించి కర్ణాటక చేసిన కొత్త ప్రతిపాదన విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం సుప్రీం పరిధిలో ఉన్న ఈ కేసుకు సంబంధించి కర్ణాటక చేస్తోన్న కొత్త వాదన ఏంటంటే.. తమ వద్ద నీరు ఉన్నప్పుడే తమిళనాడుకు నీటిని విడుదల చేస్తామని, అంతదాకా బాకీ కింద దాన్ని జమకట్టాలని పేర్కొంటున్నది.

కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయాల్సిందిగా సుప్రీం స్పష్టం చేసిన నేపథ్యంలో.. మరోసారి సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ వేసింది కర్ణాటక. అందులో ఈ కొత్త ప్రతిపాదనను పొందుపరిచింది. సుప్రీం తీర్పు మేరకు తమిళనాడు నీటి విడుదల సాధ్యం కాదని వాదిస్తూ.. కావాలంటే విడుదల చేయాల్సిన నీటిని బాకీ కింద జమకడితే, డిసెంబర్ నాటికి విడుదల చేస్తామని చెబుతోంది కర్ణాటక.

Cauvery Issue: Karnataka refuses to budge, tells SC can only release more water by December

అయితే రాబోయే రోజుల్లో నమోదయ్యే వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుని, వరద నీటిని తమిళనాడును విడుదల చేయాలనే ఆలోచనలో కర్ణాటక ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 6వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలంటూ సుప్రీం కర్ణాటకను ఇదివరకే ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా, కర్ణాటక చేసిన ఈ ప్రతిపాదనపై పలువురు నోరెళ్లబెడుతున్నారు. నీటి లెక్కలను కూడా బాకీ కింద జమకట్టాలని కోరడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

English summary
In what could give rise to fresh stand-off between the states of Karnataka and Tamil Nadu, the Karnataka government on Monday moved Supreme Court seeking the modification of the 20 September order asking the state to release 6,000 cusecs of Cauvery water to its neighbouring state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X