వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకటవ తరగతి అడ్మీషన్ కు రూ. లక్ష లంచం: ప్రిన్సిపల్ ను అరెస్టు చేసిన సీబీఐ, దళితుడు!

|
Google Oneindia TeluguNews

చెన్నై: కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని చేర్చుకోవడానికి (అడ్మీషన్) రూ. ఒక లక్ష లంచం తీసుకున్న కేంద్రీయ విద్యాలయం పాఠశాల ప్రిన్సిపల్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. చెన్నైలోని అశోక్ నగర్ లోని కేంద్రీయ విద్యాలయం పాఠశాల ప్రిన్సిపల్ ఇ. అనంతన్ ను మంగళవారం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

దళిత కుటుంబం !

దళిత కుటుంబం !

దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి తన కుమారుడిని కేంద్రీయ విద్యాలయం స్కూల్ లో ఒకటవ తరగతిలో చేర్పించడానికి వెళ్లాడు. ఆర్ టీఈ కోటాలో తన కుమారుడికి సీటు ఇవ్వాలని బాలుడి తండ్రి ప్రిన్సిపల్ ఇ. అనంతన్ కు మనవి చేశాడు.

రూ. లక్ష లంచం

రూ. లక్ష లంచం

ఆర్ టీఈ కోటాలో మీ అబ్బాయికి ఒకటవ తరగతిలో సీటు ఇవ్వాలంటే రూ. ఒక లక్ష లంచం ఇవ్వాలని ప్రిన్సిపల్ అనంతన్ డిమాండ్ చేశారు. రూ. లక్షకు తక్కువ లంచం ఇచ్చినా సీటు మాత్రం ఇవ్వనని, లంచం ఇస్తేనే సీటు ఇస్తానని ప్రిన్సిపల్ అనంతన్ తేల్చి చెప్పాడు.

లంచం ఇవ్వలేని తండ్రి !

లంచం ఇవ్వలేని తండ్రి !

దళితుడైన ఆ తండ్రి రూ. లక్ష లంచం ఇవ్వలేక నానా ఇబ్బంది పడ్డాడు. ఇలాంటి అవినీతి ప్రిన్సిపల్ ఉన్నంతవరకు తనలాంటి పేదలకు న్యాయం జరగదని నిర్ణయించిన అతను సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చాడు.

సీబీఐ అధికారుల స్కెచ్

సీబీఐ అధికారుల స్కెచ్

సీబీఐ అధికారులు పక్కాప్లాన్ వేశారు. మంగళవారం దళిత తండ్రి నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటున్న ప్రిన్సిపల్ అనంతన్ ను ఆయన చాంబర్ లోనే సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం అనంతన్ ను సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అనుమతితో అనంతన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తామని సీబీఐ అధికారులు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం

చెన్నైలోని అశోక్ నగర్ లో 3.75 ఎకరాల స్థలంలో కేంద్ర ప్రభుత్వం 1981లో కేంద్రీయ విద్యాలయం స్థాపించింది. ఈ కేంద్రీయ విద్యాలయంలో తమ పిల్లలను చదివిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు భావిస్తుంటారు. ఒకటవ తరగతి అడ్మీషన్ కు ప్రిన్సిపల్ అనంతన్ రూ. ఒక లక్ష లంచం తీసుకుని సీట్లు అమ్ముకుంటున్నాడని సీబీఐ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

English summary
CBI sleuths have arrested the principal of a Kendriya Vidyalaya school in the city, for allegedly receiving bribe from a parent for admission of his ward.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X