లాలూ ఫ్యామిలీకి మరో షాక్: ఐఆర్సీటీసీ కేసులో సీబీఐ ఛార్జీషీటు
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలుప్రసాద్ యాదవ్ సహా మొత్తం 14 మందిపై సీబీఐ సోమవారం అభియోగపత్రాలను దాఖలు చేసింది . ఇందులో లాలు భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి కూడా ఉన్నారు. తేజస్విపై చార్జిషీట్ దాఖలు చేయడం ఇదే తొలిసారి.
రబ్రీదేవిని ఇటీవల సీబీఐ ప్రశ్నించిన సంగతి విదితమే. కేంద్ర రైల్వేమంత్రిగా లాలు ఉన్నప్పుడు రాంచీ, పురీలో ఉన్న రెండు ఐఆర్సీటీసీ హోటళ్లను సుజాత హోటల్స్ అనే ప్రైవేటు కంపెనీకి అక్రమంగా కట్టబెట్టినట్లు సీబీఐ ఆరోపిస్తోంది.
ఈ హోటల్ ప్రమోటర్లు లాలు కుటుంబానికి చాలా సన్నిహితులని పేర్కొంది. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నట్టు పేర్కొన్న సీబీఐ లాలూ కుటుంబ సభ్యులతోపాటు రైల్వే అధికారులపైనా చార్జిషీటు దాఖలు చేసింది.
Recommended Video
అక్రమంగా కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా 'డిజిటల్ మార్కెటింగ్' అనే బినామీ కంపెనీ పేరుతో పాట్నాలో మూడు ఎకరాల భూమిని 'నీకిది-నాకిది' పద్ధతిలో సొంతం చేసుకున్నారని అభియోగపత్రంలో సీబీఐ నమోదు చేసింది.