మాయావతి డిఏ కేసు విచారణ ముగిస్తున్నాం: సిబిఐ
మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆదాయానికి మంచిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేపట్టింది. సిబిఐ వర్గాల సమాచారం మేరకు త్వరలోనే మాయావతికి సంబంధించిన అక్రమాస్తుల కేసు విచారణను ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉన్నతస్థానంలో ఉన్న రాజకీయ నేతల కేసుల విషయంలో సిబిఐ అనుసరిస్తున్న విచారణ విధానం సరిగా లేదని ఇటీవల సుప్రీం కోర్టు సిబిఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
చట్టానికి లోబడి చర్యలు తీసుకుంటున్నామని సిబిఐ వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయాపతిపై తాజ్ కారిడార్ కేసుకు సంబంధించిన విచారణను జరపాలని ఆగస్టు 8న కోర్టు తెలిపింది.మాయావతికి సంబంధించిన అక్రమాస్తుల కేసును సమీక్షించాలని కోరుతూ వచ్చిన పిటిషన్ను సరైన ఆధారాలు లేకపోవడంతో జస్టిస్ పి సదాశివం, జస్టిస్ దీపక్ మిశ్రాల బెంచ్ తోసిపుచ్చింది.
మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాజ్ కారిడార్ కోసం ప్రభుత్వ ఆమోదం లేకుండా విడుదలైన 17కోట్ల రూపాయలకు సంబంధించి ఆరోపణలు రావడంతో సిబిఐ దానిపై విచారణ జరుపుతోంది. మాయావతి అక్రమాస్తుల విషయంలో సరైనా ఆధారాలు లేకుండా విచారణ కొనసాగిస్తున్న సిబిఐ వైఖరిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే మాయావతి అక్రమాస్తుల కేసును ముగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.