ఐఏఎస్ డికే రవి కేసు: రీ-పోస్టుమార్టంకు సీబీఐ మొగ్గు
బెంగళూరు: సిన్సియర్ ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు, రీపోస్టుమార్టం నిర్వహించడానికి థర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో రవి మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టుం నివేదికను పరిశీలించారు.
వాణిజ్య పన్నుల విభాగంలో జాయింట్ డైరెక్టర్ గా పని చేసే డీకే రవి అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. విక్టోరియా ఆసుపత్రిలో రవి మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించారు. కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించారు.
సీబీఐ అధికారులు రవి మృతదేహానికి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు. విక్టోరియా ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టుం నివేదిక, వీసేరా స్యాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబరేటరికి పంపించామని సీబీఐ అధికారులు అంటున్నారు.
గతంలో కేసు దర్యాప్తు చేసిన సీఐడి అధికారులు నివేదికలో రవి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని వివరాలు పోందుపరిచారు. అయితే సీబీఐ అధికారులు మాత్రం రవి కేసు దర్యాప్తులో భాగంగా మళ్లి పోస్టుమార్టుం నిర్వహించాలని బావిస్తున్నారు.
విక్టోరియా ఆసుపత్రి వైద్యులు ఐఏఎస్ అధికారి రవి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోస్టుమార్టుం నివేదిక ఇచ్చారు. అయితే ఆ నివేదిక ఆదారంగా సీబీఐ అధికారులు దర్యాప్తు పూర్తి చెయ్యడానికి సిద్దంగా లేరు. రవి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సాటి ఉద్యోగులు తెలిపిన వివరాల ఆదారంగా విచారణ చేస్తున్నారు.