వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఏఎస్ డికే రవి కేసు: రీ-పోస్టుమార్టంకు సీబీఐ మొగ్గు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సిన్సియర్ ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు, రీపోస్టుమార్టం నిర్వహించడానికి థర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో రవి మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టుం నివేదికను పరిశీలించారు.

వాణిజ్య పన్నుల విభాగంలో జాయింట్ డైరెక్టర్ గా పని చేసే డీకే రవి అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. విక్టోరియా ఆసుపత్రిలో రవి మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించారు. కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించారు.

సీబీఐ అధికారులు రవి మృతదేహానికి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు. విక్టోరియా ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టుం నివేదిక, వీసేరా స్యాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబరేటరికి పంపించామని సీబీఐ అధికారులు అంటున్నారు.

CBI probing the DK Ravi case will seek a second opinion on the autopsy report.

గతంలో కేసు దర్యాప్తు చేసిన సీఐడి అధికారులు నివేదికలో రవి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని వివరాలు పోందుపరిచారు. అయితే సీబీఐ అధికారులు మాత్రం రవి కేసు దర్యాప్తులో భాగంగా మళ్లి పోస్టుమార్టుం నిర్వహించాలని బావిస్తున్నారు.

విక్టోరియా ఆసుపత్రి వైద్యులు ఐఏఎస్ అధికారి రవి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోస్టుమార్టుం నివేదిక ఇచ్చారు. అయితే ఆ నివేదిక ఆదారంగా సీబీఐ అధికారులు దర్యాప్తు పూర్తి చెయ్యడానికి సిద్దంగా లేరు. రవి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సాటి ఉద్యోగులు తెలిపిన వివరాల ఆదారంగా విచారణ చేస్తున్నారు.

English summary
The Central Bureau of Investigation (CBI) probing the DK Ravi case will seek a second opinion on the autopsy report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X