కేంద్ర మాజీ మంత్రి జయంతికి షాక్ ఇచ్చిన సీబీఐ అధికారులు: జిందాల్ కు సహాయం ?
చెన్నై: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ తమిళనాడు సీనియర్ నాయకురాలు జయంతి నటరాజన్ ఇంటిలో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో అధికార దుర్వినియోగం చేశారని జయంతి మీద సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
2009 నుంచి 2014 వరకు కేంద్రంలో యూపీఏ - 2 అధికారంలో ఉన్న సమయంలో జయంతి కేంద్ర పర్యాటక శాఖా మంత్రిగా పని చేశారు. ఆ సందర్బంలో జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జేఎస్ డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలకు లబ్ధీ చేకూరేవిధంగా జయంతి సహకరించారని ఆరోపణలు ఉన్నాయి.
జార్ఖండ్ లోని అటవి ప్రాంత భూములు అక్రమంగా ఖనిజం (గనులు) తియ్యడానికి అనుమతి ఇచ్చారని జయంతి మీద సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ రెండు కంపెనీలు అటవి ప్రాంత భూములు ఆక్రమించుకుని ఖనిజం బయటకు తియ్యడానికి కేంద్ర మంత్రి జయంతి అనుమతి ఇచ్చారని సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. జయంతి ఇంటిలో అనేక పత్రాలు స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు లోతుగా పరిశీలన చేస్తున్నారు.