సీబీఎస్ఈ 10 పరీక్షలు జులై 1 నుంచి, 12 పరీక్ష జులై 9, షెడ్యూల్ ఇదే
న్యూఢిల్లీ: కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్ను తాజాగా సీబీఎస్ఈ విడుదల చేసింది. జులై 1 నుంచి 15వ తేదీల మధ్యన ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. పరీక్షలను ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
Recommended Video
కరోనావైరస్: ప్రపంచంలో మిలియన్ జనాభాలో ఎంత మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారో తెలుసా?
प्रिय विद्याथिर्यों,
— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 18, 2020
आप सभी से #CBSE की 12वीं की बची हुई परीक्षाओं की डेट शीट साझा कर रहा हूँ।
मैं आप सभी को आगामी परीक्षाओं के लिए हार्दिक शुभकामनाएं देता हूँ।#StaySafe #StudyWell@HRDMinistry @mygovindia @PIBHindi @MIB_Hindi pic.twitter.com/NL2LDiJvh6
సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను జులై 1, 2, 10, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇక 12వతరగతి బిజినెస్ స్టడీస్ పేపర్ జులై 9న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం cbse.nic.in సంప్రదించవచ్చు.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తన ట్విట్టర్ ఖాతాలో పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. 9వ తరగతి, 11వ తరగతి ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం మరోసారి పరీక్షల నిర్వహించేందుకు కూడా సీబీఎస్ఈ ఏర్పాట్లు చేస్తోంది. వీరికి కూడా త్వరలోనే పరీక్షలు నిర్వహించనుంది.
CBSE releases date sheet for the re-scheduled board examinations of class 10th (for North-East Delhi only) pic.twitter.com/a49FC9OaNg
— ANI (@ANI) May 18, 2020
పరీక్షలకు
హాజరయ్యే
విద్యార్థులు
తప్పనిసరిగా
హ్యాండ్
శానిటైజర్ను
తెచ్చుకోవాలని
సీబీఎస్ఈ
సూచించింది.
పరీక్ష
హాలులోకి
వచ్చిన
తర్వాత
ప్రతి
విద్యార్థి
ఫిజికల్
డిస్టాన్స్
పా
టించాలని
స్పష్టం
చేసింది.
ప్రతి
విద్యార్థి
ముక్కును,
నోటిన
మాస్కుతో
కవర్
చేసుకోవాలని
సూచించింది.
బోర్టు
పెట్టిన
నియమాలను
ప్రతి
విద్యార్థి
తప్పనిసరిగా
పాటించాలని
స్పష్టం
చేసింది.