10, 12 తరగతి సీబీఎస్ఈ విద్యార్థుల మార్కులు ఇలా..? ఎలా ఇస్తారంటే...
కరోనా వైరస్ వల్ల సీబీఎస్ఈ 10, 12 తరగతి మిగతా పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. దీంతో విద్యార్థులను ప్రమోట్ చేస్తామని, సీబీఎస్ఐ బోర్డు నిన్న సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే వారు గత పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు. మూడు సబ్జెక్టుల కన్నా ఎక్కువ పరీక్షలకు హాజరైన విద్యార్థులను.. 3 సబ్జెక్టుల్లో మంచి ప్రతిభ కనిబరిచిన మార్కల సగటును తీసి.. మిగతా సబ్జెక్టులకు కూడా మార్కులు జమచేస్తామని తెలిపారు.
వేశ్యావాటికలు తెరిస్తే ఇక అంతే: 4 లక్షల మందికి వైరస్, 12 వేల మంది మృతి..? శాస్త్రవేత్తలు..
ఒకవేళ సదరు విద్యార్థి మూడు సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు మాత్రమే రాస్తే.. రెండు పరీక్షల మార్కుల సగటును పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. అయితే ఢిల్లీలో మాత్రమే విద్యార్థులు 1 లేదా రెండు సబ్జెక్టులు మాత్రమే రాశారని సీబీఎస్ఈ అధికారులు పేర్కొన్నారు. వారికి ఆ సబ్జెక్టు లేదా ఇంటర్నల్/ప్రాక్టికల్/ప్రాజెక్టు ఆధారంగా మార్కులు వేస్తామని పేర్కొన్నారు.
Recommended Video
మార్కులు వేసేందుకు కూడా సౌలభ్యం లేకుంటే ప్రతిభ మెరగుపరుచుకునేందుకు ఆప్షనల్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఆ ఫలితాలను కూడా మిగతా విద్యార్థులతో కలిపి ప్రకటిస్తారు. మరోవైపు విద్యార్థుల మార్కుల జాబితాను సీబీఎస్ఈ ఇప్పటికే రూపొందించింది. దానిని శుక్రవారం సుప్రీంకోర్టుకు అందజేయనుంది. కోర్టు ఆదేశాల మేరకు ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.