కర్ణాటకలో గాడ్సె జయంతి ఉత్సవాలు...! అరెస్ట్ చేసిన పోలీసులు
కర్ణాటక రాష్ట్ర్రంలో వివావాదస్పద గాడ్సే జయంతి వేడుకలు జరిగాయి. ఈ జయంతి వేడుకలను కర్ణాటక హిందు మహాసభ్యులు నిర్వహించారు. గాడ్సేకు పూలామాల వేసి నివాళులు అర్పించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు జయంతివేడుకలను నిర్వహించిన ఆరుగురు హిందు మహసభ సభ్యులను అరెస్ట్ చేశారు.
కాగా గాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడంటూ భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.దీంతో ఆమే వ్యాఖ్యలు దేవవ్యాప్తంగా సంచనలం రేపాయి.కాగా సాధ్వీ వ్యాఖ్యలపై ప్రతిపక్షపార్టీలతో పాటు బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆమే వ్యాఖ్యలపై వివరణ కోరుతూ క్షమాపణ చెప్పాల్సిందిగా కోరాడు.మరోవేపు ఏకంగా ఈవ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. సాద్వీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆమే వ్వాఖ్యలను ఎంత మాత్రం క్షమించరానివని ఆయన పేర్కోన్నారు.
ఇక తాజగా దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందంటూ ఎగ్జిట్పోల్స్ ఫలితాలు వెలువడనుండడంతో బీజేపీతోపాటు దాని అనుబంధ సంఘాల పార్టీల్లో మరింత జోష్ నిండింది. దీంతో ఏకంగా గాడ్సే జయంతి ఉత్సవాలను నిర్వహించడం సంచలనం రేపుతోంది. గతంలో ఎప్పుడు లేనట్టుగా గాడ్సే జయంతి ఉత్సవాలను నిర్వహించడంతో గాడ్సే వివాదం మరోసారి తెరపైకి రానుంది.