ఎన్నికల్లో గెలిచింది భార్య.. ఆసుపత్రి పాలైంది భర్త, కారణం అదేనా?
మీరట్ : భార్య గెలుపుని హర్షించలేని భర్తలూ ఉంటారని ఈ ఘటన రుజువు చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో తన భార్య విజయం సాధించిన ఆనందంలో విషం కలిపిన మిఠాయిలు తిని ఓ భర్త ఆసుపత్రి పాలయ్యాడు.
అసలేం జరిగిందంటే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ పట్టణానికి చెందిన షాహిద్ అబ్బాసీ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు. తాజాగా జరిగిన మీరట్ మున్సిపల్ ఎన్నికల్లో షాహిద్ భార్య నజ్రీన్ విజయం సాధించింది.
దీంతో అతని కుటుంబ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. అందరూ సంబరాల్లో ఉండగా షాహిద్కు రక్తపు వాంతులు ప్రారంభమయ్యాయి. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. విషం కలిపిన మిఠాయి తిన్నందువల్లే అతనికి రక్తపు వాంతులు అయ్యాయని వైద్యులు తేల్చి చికిత్స చేస్తున్నారు.
స్థానిక ఎమ్మెల్యేతో పాటు పలువురు సమాజ్ వాదీ పార్టీ నాయకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షాహిద్ ను పరామర్శించారు. వైద్యుల నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని మీరట్ పోలీసులు చెప్పారు.
భార్య ఎన్నికల్లో గెలవడాన్ని భరించలేక షాహిద్ స్వయంగా విషం కలిపిన మిఠాయి తిని ప్రాణాలు తీసుకోవాలని భావించాడా? లేకపోతే ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనా? ప్రస్తుతానికి ఇది సస్పెన్స్గా మారింది.