వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్‌కు బాంబు లాంటి వార్త‌: కేంద్ర పాలిత ప్రాంత ప‌రిధిలోకి పీఓకే: పూర్తిగా కేంద్రం ఆధీనంలోకే..

|
Google Oneindia TeluguNews

కేంద్ర ఆర్దిక మంత్రి..ర‌క్ష‌ణ శాఖా మంత్రి మాజీ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బాంబు పేల్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం జ‌మ్ము కాశ్మీర్ విష‌యంలో తీసుకున్న ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు పైనే దేశం మొత్తం ఆస‌క్తిగా చూస్తున్న వేళ‌.. అస‌లు ల‌క్ష్యం ఏంటో నిర్మ‌లా సీతారామ‌న్ స్ప‌ష్టం చేసారు. జ‌మ్ము కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా ..ల‌ఢ‌ఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అయితే, జ‌మ్ముకాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత ప‌రిధిలోకి పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ వ‌స్తుంద‌ని చెప్ప‌టం ద్వారా అస‌లు ల‌క్ష్యం ఏంటో బ‌య‌ట పెట్టేసారు. ఉద‌యం నుండి జాగ్ర‌త్త‌గా పావులు క‌దుపుతున్న బీజేపీ అధినాయ‌క‌త్వం ఇప్పుడు జ‌మ్ము కాశ్మీర్ అభివృద్దితో పాటుగా పీఓకే విముక్తి చేయ‌టమే ల‌క్ష్య‌మ‌నే అంచ‌నాలు మొద‌ల‌య్యాయి.

 మేనిఫెస్టోలోనే నాడు స్ప‌ష్టం చేసిన బీజేపీ: నేడు ఆచ‌ర‌ణ‌లో 370 ర‌ద్దు మేనిఫెస్టోలోనే నాడు స్ప‌ష్టం చేసిన బీజేపీ: నేడు ఆచ‌ర‌ణ‌లో 370 ర‌ద్దు

కేంద్ర‌ప్రాంత ప‌రిధిలోకి పీఓకే..

కేంద్ర‌ప్రాంత ప‌రిధిలోకి పీఓకే..

కేంద్ర ప్ర‌భుత్వం వేస్తున్న వ్యూహాత్మ‌క అడుగుల్లోకి అస‌లు ల‌క్ష్యం ఏంట‌నేది రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ స‌మ‌యంలో బ‌య‌ట ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్రత్యేక ప్ర‌తిప‌త్తితో సాగుతున్న జ‌మ్ము కాశ్మీర్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు సాగిన ఆర్టిక‌ల్ 370ను ర‌ద్దు చేస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. అదే స‌మ‌యంలో జ‌మ్ము కాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్ర‌తిపా దించారు. జ‌మ్ము కాశ్మీర్‌కు చ‌ట్ట స‌భ‌తో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా నిర్ణ‌యించారు. ల‌ఢ‌ఖ్‌ను చంఢీఘ‌ర్ త‌ర‌హా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్ర‌తిపాదించారు. దీని ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి తో ఉన్న జ‌మ్ము కాశ్మీర్ ఇక నుండి పూర్తిగా కేంద్రం ప‌రిధిలోకి రానుంది. జ‌మ్ము కాశ్మీర్‌లో చ‌ట్ట స‌భ‌లు ఉన్నా..కేంద్రం పెత్త‌నం కొన‌సాగ‌నుంది. ఇదే అంశం పైన రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ స‌మ‌యంలో ఆర్దిక మంత్రి..ర‌క్ష‌ణ శాఖా మాజీ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కీల‌క అంశాన్ని బ‌య‌ట పెట్టారు. జ‌మ్ము కాశ్మీర్‌తో పాటుగా పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ మొత్తంగా కేంద్ర పాలిత ప్రాంతం ప‌రిధిలోకి వ‌స్తుంద‌ని వెల్ల‌డించారు.

పీఓకే మీద కేంద్రం అజ‌మాయిషీ ద్వారా..

పీఓకే మీద కేంద్రం అజ‌మాయిషీ ద్వారా..

పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ మీద ప‌ట్టుకోసం కేంద్ర ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా ఒక్కో అడుగు వేస్తోంది. అందులో భాగంగా ఇప్ప‌టికే పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదం గురించి అంత‌ర్జాతీయ వేదిక‌ల మీద ప్ర‌స్తావించి..దౌత్య ప‌రంగా పాకిస్థాన్‌ను ఏకాకిని చేసింది. ఒక ర‌కంగా అంత‌ర్జాతీయ స‌మాజంలో పాకిస్థాన్‌ను ఒంట‌రి చేసింది. ఆర్దిక‌-పాల‌నా ప‌ర‌మైన ఇబ్బం దుల‌తో స‌త‌మ‌తం అవుతున్న పాకిస్థాన్ ను పూర్తిగా దెబ్బ తీయాల‌నే ల‌క్ష్యంతో ముందుకు వెళ్తోంది. అందులో భాగం గా ముందుగా జ‌మ్ము కాశ్మీర్ ను పూర్తిగా త‌మ నియంత్ర‌ణ‌లోకి తెచ్చుకుంటోంది. కేంద్ర పాల‌త ప్రాంతంగా చేయటం ద్వారా అక్క‌డ అసెంబ్లీ ఉన్నా పెత్త‌నం కేంద్రందే సాగుతోంది. ఇక‌, ల‌డ‌ఖ్‌లో పూర్త‌గా కేంద్ర‌మే ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటుంది. ఇప్పుడు తాజాగా పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ సైతం కేంద్ర పాలిత ప్రాంత ప‌రిధిలోకి రావ‌టం ద్వారా కేంద్రానికి ముందుగా దాని పైన అజ‌మాయిషీకి అవ‌కాశం ఏర్ప‌డుతోంది. ఆ త‌రువాత ప‌రిస్థితుల‌కు అనుగుణంగా పీఓకే విష‌యంలో నిర్ణ‌యా లు చేయ‌టానికి కేంద్రం త‌మ వ‌ద్దే అధికారం ఉండేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది.

కాశ్మీర్ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం దిశ‌గా..

కాశ్మీర్ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం దిశ‌గా..

ఏడు ద‌శాబ్దాలుగా సాగుతున్న కాశ్మీర్ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపాల‌ని రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన స‌మ యంలోనే ప్ర‌ధాని మోదీ నిర్ణ‌యించారు. దీని కోసం అంత‌ర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ మీద ఒత్తిడి పెంచుతూనే.. దేశం లో చొర‌బాట్ల నిరోధానికి సైన్యానికి పూర్తి స్వేచ్చను ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో ఇప్పుడు జ‌మ్ము కాశ్మీర్ పైన పెత్త‌నం పూర్తిగా త‌మ ప‌రిధిలోకి తీసుకోవ‌టం ద్వారా ఇక ఈ స‌మ‌స్య ప‌రిష్కారం దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇప్పుడు తాజా నిర్ణ‌యాల ద్వారా ఎదుర‌య్యే ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేస్తూ..పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ ద‌క్కించుకోవ‌టం పైన మోదీ ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా ముందుకెళ్లే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. దీంతో..మోదీ త‌న హాయంలోనే కాశ్మీర్ స‌మ‌స్య ప‌రిష్క‌రించిన ఘ‌న‌త ద‌క్కించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. వ్యూహం ప‌క్కా..ఇక అమ‌లు చేయ‌ట‌మే మిగిలి ఉంది.

English summary
Central Finance minister revealed that POK will be in union territory control with Central Govt proposed Jammu Kahmir re organisation act. With this proposal Central Govt directly supervise the POK issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X