మోడీ ఓటమికి కుట్ర.. పాకిస్థాన్ తో కాంగ్రెస్ చేతులు కలిపింది.. ఉమాభారతి సెన్సెషనల్ కామెంట్స్
మధ్యప్రదేశ్ : మోడీ ఓటమికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు కేంద్ర మంత్రి ఉమా భారతి. అంతేకాదు పాకిస్థాన్ తో చేతులు కలిపిందని సెన్సేషనల్ కామెంట్ చేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉమాభారతి ఇలా ఆరోపణలు చేయడం చర్చానీయాంశంగా మారింది. కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ ఆమె చేసిన ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది.
బంగ్లాదేశ్ కోసం భారత్, పాకిస్థాన్ మధ్య పోరాటం జరిగిన సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత వాజ్ పేయి ప్రధాని ఇందిరాగాంధీకి అండగా నిలబడ్డారని.. అందుకే అప్పటి రాజకీయాలు అంత బాగున్నాయన్నారు.
ఇటీవల పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెట్టడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ఆర్మీ చీఫ్ ను గుండాగా అభివర్ణించిన కాంగ్రెస్ లీడర్లను ఏమనాలి అంటూ ఫైరయ్యారు. ఏకంగా ఓ కాంగ్రెస్ నాయకుడు పాకిస్థాన్ వెళ్లి మోడీని ఓడించాలని కుట్ర చేశారని ఆరోపించారు.