వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏదైనా ఆఫీసులో ఒక్కరిద్దరికి కరోనా సోకితే ఏం చేయాలంటే..: కేంద్రం కొత్త మార్గదర్శకాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో మారోసారి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించిన విషయం తెలిసిందే. మే 31 వరకు పొడిగించిన ఈ లాక్‌డౌన్‌లో పలు సడలింపులను కూడా ఇచ్చింది. ప్రజా రవాణా విషయంలో రాష్ట్రాలకే నిర్ణయాధికారాన్ని ఇచ్చింది.

ఆఫీసులో ఒక్కరిద్దరికి కరోనా సోకితే ఏం చేయాలంటే...

ఆఫీసులో ఒక్కరిద్దరికి కరోనా సోకితే ఏం చేయాలంటే...

దేశ వ్యాప్తంగా దుకాణాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు తెరవచ్చని కేంద్రం పేర్కొంది. అయితే, పని ప్రదేశంలో కరోనా నివారణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం.. ఏదైనా ఒక కార్యాలయంలో ఒకరికి లేదా ఇద్దరికి కరోనా సోకితే మొత్తం కార్యాలయాన్ని మూసివేయాల్సిన అవసరం లేదు. కరోనా బాధితులను ఆస్పత్రులకు తరలించి, వారు తిరిగిన ప్రదేశాన్ని డిస్ఇన్ఫెక్షన్ చేసిన 48 గంటల తర్వాత తిరిగి కార్యాలయంలో కార్యకలాపాలను చేసుకోవచ్చని తెలిపింది.

కరోనా లక్షణాలుంటే..

కరోనా లక్షణాలుంటే..

కార్యాలయంలో ఎవరైన కరోనా లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే కేంద్ర లేదా రాష్ట్ర వైద్య అధికారులకు సమాచారం ఇవ్వాలి. 1075 హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేసి వివరాలు చెప్పాలి. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆరోగ్యశాఖ పేర్కొంది.

Recommended Video

Gold Price Reduced Today, 10 grams Gold Now 47,980
వారికి వర్క్ ఫ్రం హోం అవకాశం ఇవ్వాలి..

వారికి వర్క్ ఫ్రం హోం అవకాశం ఇవ్వాలి..

ఉద్యోగుల, సందర్శకులు సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే కరోనాకు దూరంగా ఉండవచ్చని తెలిపింది. భౌతిక దూరం, మాస్కులు ధరించడం, చేతులను తరచూ శుభ్రపర్చుకోవడం, శానిటైజర్స్ ను ఉపయోగించడం లాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో ఉన్న ఉద్యోగులు కోరితే వారికి వర్క్ ఫ్రం హోం చేసేందుకు అనుమతించాలని కేంద్రం స్పష్టం చేసింది.

English summary
As India entered the fourth phase of its nationwide lockdown with relaxations and offices and working places opening, the Union Ministry of Health and Family Welfare has issued guidelines on preventive and response measures to contain the spread of COVID-19 in workplace settings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X