ఆ నాలుగు రాష్ట్రాలు కేర్ ఫుల్, వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ..
కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటు వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో వచ్చే తేదీపై స్పష్టత లేదు. దీంతో వైరస్ ఎక్కువ వ్యాపిస్తోన్న రాష్ట్రాలపై కేంద్రం దృష్టిసారించింది. మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్ గఢ్, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ సూచించింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో 59 శాతం కరోనా వైరస్ యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రాన్ని నిందిస్తున్నాయి. కరోనా వైరస్ టెస్టులు సరిగా చేయడం లేదని అంటున్నాయి. దీనికితోడు స్ట్రెయిన్ రావడంతో మరింత ఆందోళన నెలకొంది. వైరస్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతోంది. కరోనా, స్ట్రెయిన్ నేపథ్యంలో ప్రజలు విధిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరుతోంది.
కేరళ, చత్తీస్ గడ్, మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వీటిలో మహారాష్ట్రలో వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఇక్కడ 52 వేల యాక్టివ్ కేసులు ఉండగా.. 50 వేల మంది వరకు చనిపోయారు. బెంగాల్, చత్తీస్ గడ్లో 9 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. బెంగాల్లో 10 వేల మంది చనిపోగా.. చత్తీస్ గడ్లో 3500 మంది మృతిచెందారు. కేరళలో వారానికి 5 వేల కొత్త కరోనా కేసులు వస్తున్నాయి. మహారాష్ట్రలో 3700 వస్తున్నాయి. చత్తీస్ గడ్ 1006, బెంగాల్లో 908 కేసులు రికార్డవుతున్నాయి.